ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 ప్రయోగాల వరకు సాగుతున్నాయి. అందులో ఐదారు ప్రయోగాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
పెద్దగా ప్రచారం లేకుండా ఈ నెల మొదట్లో రష్యా తయారు చేస్తున్న వ్యాక్సిన్ గురించిన వార్తలు తెర మీదకు వచ్చి అందరి చూపు ఆ దేశం మీద పడేలా చేశాయి. తాజాగా లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఫలితాలు బాగున్నాయని.. మూడో దశ హ్యుమన్ ట్రయల్స్ కు రంగం సిద్ధమవుతున్న వేళలో.. రష్యా వ్యాక్సిన్ విడుదల తేదీ మీద తాజా వార్తలు రావటం గమనార్హం.
తాము ఇప్పటికే రెండు ప్రయోగాల్ని పూర్తి చేశామని.. మూడో ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఓవైపు క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్న వేళలోనే.. అందుకు సమాంతరంగా వ్యాక్సిన్ ఉత్తత్తిని షురూ చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో వ్యాక్సిన్ ను ప్రపంచానికి పరిచయం చేయాలని రష్యా భావిస్తోంది.
రష్యా క్లీనికల్ ప్రయోగాలు సోమవారంతో పూర్తి అయ్యాయని.. రెండో విడతలో పాల్గొన్న 20 మంది వాలంటీర్లను సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లుగా రష్యా48వ కేంద్రీయ శాస్త్ర పరిశోధన సంస్థ అధిపతి సెర్గెయ్ బోరిసెవిచ్ పేర్కొన్నారు. రష్యా రక్షణ శాఖ పత్రిక అయితే క్రాస్నియా జ్వెజ్దాకు ఈ కీలక విషయాన్ని వెల్లడించినట్లుగా అందులో వెల్లడించారు.
ఈ వ్యాక్సిన్ ను ఆగస్టు మూడు నుంచి మూడో విడత ప్రయోగాల్ని నిర్వహించనున్నారు. రష్యాతో పాటు సౌదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లో ప్రారంభించాలని రష్యా కోరుకొంటోంది. వేల మందిపై ప్రయోగాలు ఒకవైపు.. మరోవైపు దీని ఉత్పత్తిని సమాంతరంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ను గమాలెయా ఇన్ స్టిట్యూట్ డెవలప్ చేస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దీనికి ఇంకా ఆమోదం రాక ముందే రష్యా దిగ్గజ వ్యాపారస్తులతో పాటు.. రాజకీయ నేతలు దీన్ని వేయించుకుంటున్నారు. విదేశాల్లో 17 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ.. రష్యా చెబుతున్నట్లుగా తన వ్యాక్సిన్ ను వచ్చే నెలలో విడుదల చేస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద సంచలనంగా మారుతుందని చెప్పక తప్పదు.
This post was last modified on July 24, 2020 7:56 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…