Elon Musk
పంతం పట్టి ట్విట్టర్ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఆ సంస్థ సీఈవో అయిన దగ్గర్నుంచి సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతకుముందున్న ప్రధాన కార్యవర్గంతో పాటు వేల సంఖ్యలో పాత ఉద్యోగులను సాగనంపడం.. పని వేళల్ని పెంచడం లాంటి నిర్ణయాలతో మస్క్ విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే ట్విట్టర్లోనూ పలు మార్పులకు అతను శ్రీకారం చుట్టాడు.
మస్క్ నిర్ణయాలతో పాటు ట్విట్టర్ వేదికగా మస్క్ చేసే వ్యాఖ్యానాలు తిక్క తిక్కగా అనిపిస్తూ ఆయనకు విమర్శలు తెచ్చిపెడుతున్నాయి. తన మీద జనాలు చూపిస్తున్న వ్యతిరేకత, ట్రోలింగ్ చూసి మస్క్ రెండు రోజుల కిందట ఒక ఆసక్తికర పోల్ పెట్టాడు. తాను ట్విట్టర్ సీఈవోగా తప్పుకోవాలా వద్దా అంటూ పోల్ పెట్టి.. ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు.
కట్ చేస్తే ఈ పోల్లో మస్క్ తప్పుకోవాలని 57.5 మంది అభిప్రాయపడ్డారు. 42.5 శాతం మంది మాత్రమే ఆయన కొనసాగాలని అన్నారు. ఈ పోల్ తర్వాత మస్క్ రెండు రోజులు సైలెంటుగా ఉండడం చర్చనీయాంశం అయింది. పోల్ ఫలితాలతో షాక్ తిని ఆ టాపిక్ను పక్కన పెట్టేశాడని అనుకున్నారు.
కానీ తాజాగా మస్క్ ఈ విషయంపై స్పందించాడు. జనాలు కోరుకున్నట్లే తాను ట్విట్టర్ సీఈవోగా తప్పుకుంటానని ప్రకటించాడు. కానీ దానికో మెలిక పెట్టాడు. తన కంటే తెలివి తక్కువ వ్యక్తి దొరగ్గానే సీఈవో పదవిని ఆ వ్యక్తికి అప్పగించేసిన.. తాను సాఫ్ట్ వేర్, సర్వర్ టీంలను చూసుకుంటానని ప్రకటించాడు. తన కంటే తెలివి తక్కువ వ్యక్తి అనడంలో వ్యంగ్యం ధ్వనిస్తోంది. దీని ఉద్దేశమేంటో మస్క్కే తెలియాలి. మరి నిజంగానే మరో వ్యక్తిని తీసుకొచ్చి మస్క్ తన స్థానంలో సీఈవోగా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on December 21, 2022 6:26 pm
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…