Trends

ట్విట్టర్ సీఈవోగా ఒక తెలివి తక్కువ వ్యక్తి కావలెను

పంతం పట్టి ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఆ సంస్థ సీఈవో అయిన దగ్గర్నుంచి సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతకుముందున్న ప్రధాన కార్యవర్గంతో పాటు వేల సంఖ్యలో పాత ఉద్యోగులను సాగనంపడం.. పని వేళల్ని పెంచడం లాంటి నిర్ణయాలతో మస్క్ విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే ట్విట్టర్లోనూ పలు మార్పులకు అతను శ్రీకారం చుట్టాడు.

మస్క్ నిర్ణయాలతో పాటు ట్విట్టర్ వేదికగా మస్క్ చేసే వ్యాఖ్యానాలు తిక్క తిక్కగా అనిపిస్తూ ఆయనకు విమర్శలు తెచ్చిపెడుతున్నాయి. తన మీద జనాలు చూపిస్తున్న వ్యతిరేకత, ట్రోలింగ్ చూసి మస్క్ రెండు రోజుల కిందట ఒక ఆసక్తికర పోల్ పెట్టాడు. తాను ట్విట్టర్ సీఈవోగా తప్పుకోవాలా వద్దా అంటూ పోల్ పెట్టి.. ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు.

కట్ చేస్తే ఈ పోల్‌లో మస్క్ తప్పుకోవాలని 57.5 మంది అభిప్రాయపడ్డారు. 42.5 శాతం మంది మాత్రమే ఆయన కొనసాగాలని అన్నారు. ఈ పోల్ తర్వాత మస్క్ రెండు రోజులు సైలెంటుగా ఉండడం చర్చనీయాంశం అయింది. పోల్ ఫలితాలతో షాక్ తిని ఆ టాపిక్‌ను పక్కన పెట్టేశాడని అనుకున్నారు.

కానీ తాజాగా మస్క్ ఈ విషయంపై స్పందించాడు. జనాలు కోరుకున్నట్లే తాను ట్విట్టర్ సీఈవోగా తప్పుకుంటానని ప్రకటించాడు. కానీ దానికో మెలిక పెట్టాడు. తన కంటే తెలివి తక్కువ వ్యక్తి దొరగ్గానే సీఈవో పదవిని ఆ వ్యక్తికి అప్పగించేసిన.. తాను సాఫ్ట్ వేర్, సర్వర్ టీంలను చూసుకుంటానని ప్రకటించాడు. తన కంటే తెలివి తక్కువ వ్యక్తి అనడంలో వ్యంగ్యం ధ్వనిస్తోంది. దీని ఉద్దేశమేంటో మస్క్‌కే తెలియాలి. మరి నిజంగానే మరో వ్యక్తిని తీసుకొచ్చి మస్క్ తన స్థానంలో సీఈవోగా చేస్తాడేమో చూడాలి.

This post was last modified on December 21, 2022 6:26 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

1 hour ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago