న‌లుగురు పిల్ల‌లు.. భ‌ర్త‌ను చంపేసి ప్రియుడితో జంప్‌

కేవ‌లం శృంగారం కోసం.. ఓ మ‌హిళ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ను చంపేసి.. తాజాగా ప‌రిచ‌య‌మైన ప్రియుడితో జంపైపోయింది. ఆమెకు న‌లుగురు పిల్ల‌లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న ఎక్క‌డో కాదు.. ఏపీలోని నెల్లూరులోనే జ‌రిగింది. స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌.. నివ్వెర‌పోయేలా చేసింది.

ఆమెకు పెళ్లైంది.. నలుగురు పిల్లలు ఉన్నారు.. అయినా సరే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంకేముంది ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. బస్తాలో మూట కట్టి చెరువులో పడేసింది. నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచ‌ల‌నం రేపింది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామానికి చెందిన శోభ‌, మ‌ణి అనే వ్య‌క్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. ఈ దంపతులు పంటపాళెం గ్రామంలో నివాసముంటున్నారు. రొయ్యల గుంట వద్ద కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తున్న వీరికి నలుగురు పిల్లలున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో.. భరత్ అనే వ్యక్తి ప్రవేశించాడు.

శోభ, భరత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో.. కాపురంలో కలతలు మొదలయ్యాయి. ప్రియుడు భరత్పై మోజు పెంచుకున్న శోభ.. భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. నాలుగు రోజుల క్రితం ప్రియుడు భరత్, మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో గ్రామ సమీపంలోని నక్కల కాలువ వద్ద మణిని గొంతు నులిమి చంపేశారు.

మృతదేహాన్ని గోతం సంచిలో మూటగట్టి నీటి ప్రవాహం అధికంగా ఉండే నక్కల కాలువలో పడేశారు. కాలువలో గోతాం సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోగి దిగిన పోలీసులు గోతామును బయటకు తీసి మణి మృతదేహంగా గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ హత్య చేసింది భార్య శోభనేనని నిర్ధారించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.