ట్విటర్లో 8 డాలర్లు చెల్లించి ఎవరైనా ఇకపై వెరిఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూ టిక్ను సొంతం చేసుకునేలా ఇటీవలే సంస్థ అధినేత అయిన ఎలాన్ మస్క్ కొత్త సదుపాయాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీని పట్ల ట్విట్టర్ యూజర్లు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీని పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఐతే మున్ముందు స్పందన ఎలా ఉంటుందో కానీ.. ఈ కొత్త సదుపాయం వల్ల ఒక ఫార్మా సంస్థ ఏకంగా ఒక్క రోజు వ్యవధిలో రూ.1.22 లక్షల కోట్ల నష్టం చవిచూడడం చర్చనీయాంశంగా మారింది.
నెలకు 8 డాలర్లు చెల్లించి బ్టూటిక్ పొందే సదుపాయాన్ని ఉపయోగించుకుంటూ తాజాగా ఎలి లిల్లీ అండ్ కంపెనీ పేరుతో ఒకరు తమ ట్విటర్ ఖాతాకు బ్లూ టిక్ కొనుక్కున్నారు. నిజానికి ఇదే పేరుతో సదరు ఫార్మా కంపెనీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ ఉంది. కానీ ఎవరో ఆ సంస్థ పేరుతో నకిలీ ఖాతా తెరిచి.. దానికి బ్లూటిక్ కూడా సంపాదించారు. ఆ ఖాతా నుంచి వేసిన ట్వీట్ భారీ నష్టానికి దారి తీసింది.
ఎలి లిల్లీ అండ్ కంపెనీ మధుమేమ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది ఐతే డూప్లికేట్ అకౌంట్ నుంచి తాజాగా.. ఇకపై మేం అందరికీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తాం.. అంటూ ట్వీట్ వేశారు. ఇలా ఉచితంగా ఇన్సులిన్ మందులు అమ్మితే కంపెనీ దివాళా తీస్తుందనే ప్రచారం జరగడంతో ఆ కంపెనీ షేర్లను అందరూ అమ్మేయడం మొదలుపెట్టారు. శుక్రవారం షేరు ధర సుమారు 4.37శాతం పడిపోయింది. 15 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను ఆ సంస్థ కోల్పోయింది.
ఈ మొత్తం మన రూపాయల్లో రూ.1.22 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఎలి లిల్లీ అండ్ కంపెనీ ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి తమ అధికారిక ఖాతా నుంచి క్లారిటీ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి మస్క్ ట్విట్టర్లో తీసుకొచ్చిన కొత్త సదుపాయం పుణ్యమా అని ఒక కంపెనీకి ఒక్క రోజు రూ.1.22 లక్లల కోట్ల నష్టం వాటిల్లిందన్నమాట.
This post was last modified on November 12, 2022 10:49 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…