Trends

కొంప‌ముంచిన ట్విట్ట‌ర్ బ్లూ టిక్‌

ట్విటర్‌లో 8 డాల‌ర్లు చెల్లించి ఎవ‌రైనా ఇక‌పై వెరిఫైడ్ అకౌంట్ల‌కు ఇచ్చే బ్లూ టిక్‌ను సొంతం చేసుకునేలా ఇటీవ‌లే సంస్థ అధినేత అయిన ఎలాన్ మ‌స్క్ కొత్త స‌దుపాయాన్ని ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీని ప‌ట్ల ట్విట్ట‌ర్ యూజ‌ర్లు చాలామంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు దీని ప‌ట్ల వ్య‌తిరేక‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఐతే మున్ముందు స్పంద‌న ఎలా ఉంటుందో కానీ.. ఈ కొత్త స‌దుపాయం వ‌ల్ల ఒక ఫార్మా సంస్థ ఏకంగా ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రూ.1.22 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం చ‌విచూడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నెల‌కు 8 డాల‌ర్లు చెల్లించి బ్టూటిక్ పొందే స‌దుపాయాన్ని ఉప‌యోగించుకుంటూ తాజాగా ఎలి లిల్లీ అండ్ కంపెనీ పేరుతో ఒకరు త‌మ‌ ట్విటర్ ఖాతాకు బ్లూ టిక్ కొనుక్కున్నారు. నిజానికి ఇదే పేరుతో స‌ద‌రు ఫార్మా కంపెనీకి చెందిన ట్విట్ట‌ర్ అకౌంట్ ఉంది. కానీ ఎవ‌రో ఆ సంస్థ పేరుతో న‌కిలీ ఖాతా తెరిచి.. దానికి బ్లూటిక్ కూడా సంపాదించారు. ఆ ఖాతా నుంచి వేసిన ట్వీట్ భారీ న‌ష్టానికి దారి తీసింది.

ఎలి లిల్లీ అండ్ కంపెనీ మ‌ధుమేమ‌ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది ఐతే డూప్లికేట్ అకౌంట్ నుంచి తాజాగా.. ఇకపై మేం అందరికీ ఉచితంగా ఇన్సులిన్ ఇస్తాం.. అంటూ ట్వీట్ వేశారు. ఇలా ఉచితంగా ఇన్సులిన్ మందులు అమ్మితే కంపెనీ దివాళా తీస్తుంద‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఆ కంపెనీ షేర్ల‌ను అంద‌రూ అమ్మేయ‌డం మొద‌లుపెట్టారు. శుక్రవారం షేరు ధర సుమారు 4.37శాతం పడిపోయింది. 15 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను ఆ సంస్థ‌ కోల్పోయింది.

ఈ మొత్తం మ‌న రూపాయ‌ల్లో రూ.1.22 ల‌క్ష‌ల కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఎలి లిల్లీ అండ్ కంపెనీ ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో గుర్తించి త‌మ అధికారిక ఖాతా నుంచి క్లారిటీ ఇచ్చినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. మొత్తానికి మ‌స్క్ ట్విట్ట‌ర్లో తీసుకొచ్చిన కొత్త స‌దుపాయం పుణ్య‌మా అని ఒక కంపెనీకి ఒక్క రోజు రూ.1.22 లక్లల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌న్న‌మాట‌.

This post was last modified on November 12, 2022 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

7 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago