Categories: Trends

కరోనా రోగులకు సాయం కోసం యువరాణి సేవకురాలైంది

కరోనా ప్రపంచాన్ని ఎంతలా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటమే కాదు.. రాజు..పేద.. అన్న తేడా లేకుండా భయపడేలా చేసింది. ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసింది. మొత్తంగా ప్రపంచం మొత్తం మారిపోయేలా చేయటమేకాదు.. కంటికి కనిపించకుండానే హడలిపోయేలా చేసింది. ఈ మహమ్మారి పుణ్యమా అని.. దేశాలకు దేశాలు కిందామీడా పడిపోతున్నాయి.

ఇదిలా ఉంటే.. కరోనా బాధితులకు సాయం చేసేందుకు.. రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మరే రాజకుటుంబం చేయని రీతిలో స్పెయిన్ రాణి వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వీడన్ రాణి సోఫియా తాజాగా తానే స్వయంగా రంగంలోకి దిగారు. వైద్యులపై ఒత్తిడిని తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియా హెమ్మెట్ వర్సిటీ కాలేజీ హెల్త్ కేర్ వాలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తోంది.

ఈ కాలేజీకి గౌరవ ఛైర్ మెంబర్ అయిన సోఫియా.. కరోనా వేళ తాను సైతం ఆ మెలుకువలు నేర్చుకునేందుకు నిర్ణయించారు. మూడు రోజుల పాటు శిక్షణ పొందిన ఆమె.. కరోనా రోగులకు సేవలు అందించేందుకు వీలుగా సేవకురాలిగా మారి..తన పెద్ద మనసును చాటుకున్నారు. రోగులకు నేరుగా సాయం అందించకున్నా.. వారికి అందే సేవల్ని స్వయంగా పర్యవేక్షించటం.. అందుకు సంబంధించిన పనులు చేస్తున్న ఆమె తీరుకు ఫిదా అవుతున్నారు.

రాచరికాన్ని.. రాణి హోదాను వదిలేసి.. రోగులకు సాయం చేయటానికి ముందుకొచ్చిన సోఫియా పెద్దమనసును ఇప్పుడందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి తీరు అరుదుగా ఉంటుందని.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని పొగిడేస్తున్నారు.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

26 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

55 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago