శృంగారం విషయంలో పురుషులు చాలా స్పీడ్గా ఉంటారని, పరిచయం అయిన.. మహిళలతో సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారని చాలా మంది అనుకుంటారు. సమాజంలోనూ ఇదే చర్చ జరుగుతుంది. కానీ.. వాస్తవానికి పురుషుల కంటే కూడా మహిళలే ఈ విషయంలో స్పీడ్గా ఉంటారని.. తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషులు, మహిళల లైంగిక జీవనానికి సంబంధించి కీలక విషయాలు వెలువడ్డాయి. 2019-21 కాలానికి గాను 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-ఎన్ఎఫ్హెచ్ఎస్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
పలు రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే అధిక మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో తేలింది. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అసోం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో అధికమంది సెక్స్ పార్టనర్లను కలిగి ఉన్నారు. రాజస్థాన్లో సగటున ఒక మహిళ 3.1 మందితో లైంగిక సంబంధం కలిగి ఉండగా.. పురుషుడు 1.8 మందితో ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉంది.
గతేడాది దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3 శాతం కాగా, మహిళ జీవిత కాలంలో సెక్స్ పార్టనర్ల సంఖ్య 1.7గా ఉంది. అదే విధంగా గతేడాది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో సంబంధం కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం కాగా, జీవిత కాలంలో 2.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో గతేడాది 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉంది.
This post was last modified on August 20, 2022 1:08 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…