శృంగారం విషయంలో పురుషులు చాలా స్పీడ్గా ఉంటారని, పరిచయం అయిన.. మహిళలతో సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారని చాలా మంది అనుకుంటారు. సమాజంలోనూ ఇదే చర్చ జరుగుతుంది. కానీ.. వాస్తవానికి పురుషుల కంటే కూడా మహిళలే ఈ విషయంలో స్పీడ్గా ఉంటారని.. తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషులు, మహిళల లైంగిక జీవనానికి సంబంధించి కీలక విషయాలు వెలువడ్డాయి. 2019-21 కాలానికి గాను 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-ఎన్ఎఫ్హెచ్ఎస్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
పలు రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే అధిక మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో తేలింది. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అసోం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో అధికమంది సెక్స్ పార్టనర్లను కలిగి ఉన్నారు. రాజస్థాన్లో సగటున ఒక మహిళ 3.1 మందితో లైంగిక సంబంధం కలిగి ఉండగా.. పురుషుడు 1.8 మందితో ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉంది.
గతేడాది దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3 శాతం కాగా, మహిళ జీవిత కాలంలో సెక్స్ పార్టనర్ల సంఖ్య 1.7గా ఉంది. అదే విధంగా గతేడాది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో సంబంధం కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం కాగా, జీవిత కాలంలో 2.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో గతేడాది 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉంది.
This post was last modified on August 20, 2022 1:08 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…