దేశంలో జనాభా పెరిగిపోతోంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా ను దాటి భారత్ నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘2022 ప్రపంచ జనాభా అంచనాల’ నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలో జనాభా నియంత్రణకు మోడీ సర్కారు నడుం బిగించింది. దేశంలో ఒకరు లేదా.. ఇద్దరు మాత్రమే పిల్లల్ని కనేలా.. చట్టం తీసుకువస్తున్నారు.
వాస్తవానికి ఇందిరమ్మ ప్రభుత్వ కాలం నుంచి కూడా “ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు!” నినాదంతో జనాభా నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే.. తర్వాత.. ఆడపిల్లల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ఈ నినాదాన్ని పక్కన పెట్టి.. ఆడపిల్లలను కనే తల్లిదండ్రులకు రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే కొన్ని పథకాలు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు మరోసారి.. జనాభా పెరిగిపోతున్న పరిస్థితి తెరమీదికి వచ్చింది.
అయితే.. దీనిని నినాదాలతో కాకుండా.. చట్టంతో నియంత్రించాలనేది మోడీ సర్కారు యోచన.. ఈ క్రమంలోనే తొలిసారి దేశంలో జనాభా నియంత్రణకు బిల్లును రూపొందించారు. దీనిని ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదించుకుని.. అమలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం.. దేశంలో ఏ కుటుంబమైనా.. ఈ ఏడాది నుంచి ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కనేందుకు అవకాశం ఉంటుంది. అంతకు మించితే.. ఏం చేస్తారనేది.. చూడాలి.
అయితే.. లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్లో ఇలా.. నిర్బంధ కుటుంబ నియంత్రణ సాధ్యమేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కొన్ని మతాలు..కులాలను గమనిస్తే.. వారిలో కుటుంబ నియంత్రణ అనేది తప్పుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులు.. సిక్కులు, జైనులు ఇతర మతస్తుల్లో ఈ ఆచారం ఉంది. ఈ నేపథ్యంలో మోడీ తీసుకువచ్చే ఈ బిల్లు.. ఏమేరకు సక్సెస్ అవుతుంది? ఎలా ముందుకు తీసుకువెళ్తారు? అనేది చూడాలి.
This post was last modified on July 27, 2022 9:58 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…