తానా ఫౌండేషన్ ట్రస్టీలు గురువారం జున్ 30వ తేదీ జరిగిన సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారి గా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ గా ఎన్నికైన శశికాంత్ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా తానాలో తానా ఫౌండేషన్ లో సేవలందిస్తూ, కాంత్ ఫౌండేషన్ స్థాపించి ద్వారా కోట్లాది రూపాయలు విరాళాలుగా అందించారు. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో ఇబ్బందులు పడిన కొన్ని వేల కుటుంబాలని ఆదుకోవటానికి కోట్లాది రూపాయల స్వంత నిధులు వెచ్చించారు, తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కోఆర్డినేటర్ గా వెయ్యుకి పైగా విద్యార్హులకు పారితోషికాలు అందించారు. శశికాంత్ వల్లేపల్లి తానా ఫౌండేషన్ కోశాధికారిగా, కార్యదర్శిగా, బోస్టన్ తెలుగు అసోసియేషన్ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.
తానా ఫౌండేషన్ కార్యదర్శిగా ఎన్నికైన విద్యాధర్ గారపాటి మూవర్స్ డాట్ కామ్ అధినేతగా అందరికి సుపరిచితులు, విద్యాధర్ గారపాటి వందకి పైగా ఉచిత కాన్సర్ క్యాంప్స్ కి రూపకల్పన చేసారు, తానా సంస్థ కోసం ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ ఆడిన బ్యాట్ ను 18 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి ఆ విరాళాన్ని తానాకు అందజేశారు. కొన్ని లక్షల డాలర్లు తానా సంస్థ కార్యక్రమాల కోసం వెచ్చించడమే కాకుండా ఎక్కడ తెలుగువారి మహాసభలు జరిగిన మంచినీళ్లు అందించాలనే విశాలహృదయంతో లక్షలాది వాటర్ బాటిల్స్ ని ఉచితంగా పంపిణీ చేశారు. విద్యాధర్ గారపాటి గతంలో తానా పబ్లిసిటీ కమిటి చైర్మన్ గా, న్యూ జెర్సీ న్యూయార్క్ ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరించారు.
తానా ఫౌండేషన్ కోశాధికారిగా ఎన్నికైన వినయ్ మద్దినేని తానా కార్యవర్గంలో కౌన్సిలర్ ఎట్ లార్జ్ గా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షుడిగా సేవలిందించారు. అట్లాంటాలో తామా ఉచిత క్లినిక్ నిర్వహణ ఏర్పాటుకు నిర్వహణకు తీవ్రంగా శ్రమించి వేలాదిమందికి అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలబడి విశేషసేవలిందించారు.
తానా ఫౌండేషన్ నూతన నాయకత్వానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు.
This post was last modified on July 2, 2022 5:11 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…