Trends

దెబ్బకు అల్లాడిపోతున్న ఉత్తరకొరియా

కరోనా వైరస్ దెబ్బకు ఉత్తర కొరియా అల్లాడిపోతోంది. దేశం మొత్తం మీద కరోనా అనుమానిత కేసులు సుమారు 8.5 లక్షలుగా రికార్డయ్యాయి. వీటిల్లో సుమారు 3.5 లక్షల మంది కరోనా నిర్ధారణై ఆసుపత్రుల్లో ఐసీయూలో వైద్యం చేయించుకుంటున్నారు. గడచిన రెండు రోజుల్లో దేశంలో కరోనా వల్ల మాత్రమే సుమారు 100 మంది చనిపోయినట్లు సమాచారం. ఇంతకాలం లేని సమస్య ఒక్కసారిగా వచ్చి మీదపడటంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు దిక్కుతోచటం లేదు.

గడచిన రెండు సంవత్సరాలుగా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతగా వణికించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఉత్తరకొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మీడియా చాలా ఆశ్చర్యంగా ప్రకటించింది. నిజానికి అప్పట్లో ఉత్తరకొరియాలో కేసులు నమోదయ్యాయో లేవో తెలీదు కానీ బయట ప్రపంచానికి మాత్రం కేసులు లేవనే ప్రభుత్వం చెప్పింది. ఉత్తర కొరియా, చైనాలో ప్రభుత్వాలు ఏ స్థాయిలో వ్యవహరిస్తాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రభుత్వాలు చెప్పిందే వినాలి, నమ్మాలంతే.

అయితే ఇపుడు హఠాత్తుగా సీన్ మారిపోయింది. రోజుల వ్యవధిలోనే ఉత్తరకొరియాలో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈనెల 12వ తేదీన దేశంలో మొదటి కేసు నమోదైతే నాలుగు రోజుల్లోనే 8 లక్షల కేసులకు ఎలా పెరిగిపోయిందో అర్ధంకాక కిమ్ లో టెన్షన్ పెరిగిపోతోంది. వైరస్ దేశంలో పాకకుండా చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించేశారు. అయినా కేసుల సంఖ్య పెరిగిపోతునే ఉంది. జనాల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించేందుకు ప్రభుత్వం 13 లక్షల ఆరోగ్య కార్యకర్తలను రంగంలోకి దింపింది.

నిజానికి ప్రపంచమంతా కరోనా వైరస్ విషయంలో ఒకలాగుంటే ఉత్తరకొరియా మాత్రం ఇంకోలాగుంది. అదేమిటంటే కరోనా పరీక్షలు చేయించలేదు. కరోనా వ్యాక్సిన్ జనాలకు వేయించలేదు. అవసరమైతే పనికొస్తాయని ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయలేదు. వ్యక్సిన్ను దేశంలోకే అనుమతించలేదు. ఎందుకంటే తమదేశంలో కరోనా వైరస్ ప్రవేశించలేందనే పనికిమాలిన ప్రకటనలిచ్చారు పాలకులు. తీరా ఇపుడు లక్షల సంఖ్యలో పెరిగిపోవటంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.

This post was last modified on May 16, 2022 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

1 hour ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

4 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

5 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

8 hours ago