ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి వైరస్ ను తుదముట్టించే వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ రాకకు మరికొన్ని నెలలు పట్టే అవకాశముండడంతో… కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు అందించే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను రూపొందించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు, వైద్యులు. ఈ క్రమంలోనే ఫ్యాబి ఫ్లూ వంటి ట్యాబ్లెట్లను మన దేశంలో తయారు చేశారు.
ఇక, తాజాగా కరోనా చికిత్సలో తొలిసారిగా ఆయుర్వేదిక్ ఉత్పత్తులు ప్రవేశించాయి. కరోనాకు చికిత్స అందించేందుకు కొరోనిల్
ను పతంజలి సంస్థ రూపొందించింది. కొరొనిల్ వాడిన తర్వాత 3 రోజుల్లో 69 శాతం మంది, 7 రోజుల్లో 100 శాతం మంది రోగులు కోలుకున్నారని, 14 రోజుల్లో కరోనాను కొరోనిల్ ఖతం చేస్తుందని వెల్లడించింది. తమ ఔషధం వాడితే నూరు శాతం రికవరీ రేటు, సున్నా శాతం మరణాల రేటు ఉంటుందని యోగా గురు బాబా రాందేవ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొరోనిల్ పై ట్విటర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
కొరొనిల్ మరింత మంది రోగులపై పనిచేసి విజయవంతమైతే ఆయుర్వేద శాస్త్రంలో ఇదో మైలురాయని ట్విట్టర్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొరొనిల్ కచ్చితత్వం నిర్ధారణ అయితే….కొరొనిల్ కోసం జనాలు పతంజలి స్టోర్ల ముందు క్యూ కడతారని కామెంట్స్ చేస్తున్నారు. ఆయుర్వేద దివ్య ఔషధం కొరొనిల్ సక్సెస్ అయితే ఫార్మా కంపెనీలకు దుర్గతి తప్పదని, మనం కనిపెట్టలేనిది పతంజలి ఎలా కనిపెట్టగలిగిందని ఫార్మా కంపెనీలు ఇరిటేట్ అవుతాయని మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు.
సబ్సే ఆగే హోగా హిందుస్తానీ అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, శాస్త్రవేత్తలకు బాబా రాందేవ్ ఫోన్ చేస్తున్నట్లు సర్కాస్టిక్ గా పోస్ట్ లు పెడుతున్నారు. కొరొనిల్ దెబ్బకు కరోనా నిల్ కావాల్సిందేనని…కొరొనిల్ వచ్చిందని తెలిసిన కరోనా గుక్కపెట్టి ఏడుస్తోందని సెటైర్లు వేస్తున్నారు. కొరొనిల్ పై నెటిజన్ల ప్రశంసలు…సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on June 24, 2020 10:33 am
స్థానిక సంస్థలకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం…
అల్లు అర్జున్కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…