ముట్టుకుంటే అంటుకునే రోగాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. కానీ ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడేలా చేసిన ఘనత మాత్రం కరోనా వైరస్కే దక్కుతుంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ‘సోషల్ డిస్టెన్స్’ మంత్రం జపిస్తోంది.
అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం మళ్లీ మామూలు పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లే పాటు సామాజిక దూరం పాటించాల్సిందేనట.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ కట్టడికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. కరోనా వైరస్కు ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు అన్నిదేశాల శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు మరో 18 నెలల సమయం పడుతుందని అంచనా. అప్పటిదాకా ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే కరోనా కట్టడిని నిలువరించాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటేదారి. కాబట్టి 2022 దాకా మనిషికి, మనిషికి మధ్య అంతరం ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు.
ఒకవేళ సోషల్ డిస్టెన్స్ను పక్కనబెడితే, జనాలు గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా మరణాల సంఖ్య ఇంతకు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.
అమెరికాలో ఇప్పటిదాకా 6 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 30 వేల మందికి పైగా మరణించారు. కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం, కరోనా నుంచి కోలుకున్న చైనాలో మళ్లీ కొత్త కేసులు నమోదు అవుతుండడంతో కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా రెండేళ్ల పాటు సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు.
This post was last modified on April 18, 2020 8:00 am
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…