Categories: Trends

2022 వరకు సోషల్ డిస్టాన్సింగ్ తప్పదా?

ముట్టుకుంటే అంటుకునే రోగాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. కానీ ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడేలా చేసిన ఘనత మాత్రం కరోనా వైరస్‌కే దక్కుతుంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ‘సోషల్ డిస్టెన్స్’ మంత్రం జపిస్తోంది.

అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం మళ్లీ మామూలు పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లే పాటు సామాజిక దూరం పాటించాల్సిందేనట.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన కరోనా వైరస్‌ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ కట్టడికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. కరోనా వైరస్‌కు ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు అన్నిదేశాల శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు మరో 18 నెలల సమయం పడుతుందని అంచనా. అప్పటిదాకా ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే కరోనా కట్టడిని నిలువరించాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటేదారి. కాబట్టి 2022 దాకా మనిషికి, మనిషికి మధ్య అంతరం ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు.

ఒకవేళ సోషల్ డిస్టెన్స్‌ను పక్కనబెడితే, జనాలు గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా మరణాల సంఖ్య ఇంతకు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.

అమెరికాలో ఇప్పటిదాకా 6 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 30 వేల మందికి పైగా మరణించారు. కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం, కరోనా నుంచి కోలుకున్న చైనాలో మళ్లీ కొత్త కేసులు నమోదు అవుతుండడంతో కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా రెండేళ్ల పాటు సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు.

Satya

Recent Posts

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

24 minutes ago

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని…

45 minutes ago

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…

46 minutes ago

ధురంధర్ స్క్రిప్ట్.. మోదీ ఆఫీసు నుంచి వచ్చిందా…?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ దగ్గర…

2 hours ago

సీనియర్ హీరో… అరుదైన జాబితాలో చేరతాడా?

2000కు అటు, ఇటు వైభవం చూసిన ఎంతోమంది సీనియర్ హీరోలు.. తర్వాతి కాలంలో యువ కథానాయకుల పోటీని తట్టుకోలేక, మారుతున్న…

3 hours ago

శంకర్ వారసుడికిది పెద్ద ఛాలెంజ్

గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 దారుణ ఫలితాలు పక్కనపెడితే దర్శకుడు శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని…

4 hours ago