2022 వరకు సోషల్ డిస్టాన్సింగ్ తప్పదా?

ముట్టుకుంటే అంటుకునే రోగాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. కానీ ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడేలా చేసిన ఘనత మాత్రం కరోనా వైరస్‌కే దక్కుతుంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ‘సోషల్ డిస్టెన్స్’ మంత్రం జపిస్తోంది.

అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం మళ్లీ మామూలు పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లే పాటు సామాజిక దూరం పాటించాల్సిందేనట.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన కరోనా వైరస్‌ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ కట్టడికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. కరోనా వైరస్‌కు ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు అన్నిదేశాల శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు మరో 18 నెలల సమయం పడుతుందని అంచనా. అప్పటిదాకా ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే కరోనా కట్టడిని నిలువరించాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటేదారి. కాబట్టి 2022 దాకా మనిషికి, మనిషికి మధ్య అంతరం ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు.

ఒకవేళ సోషల్ డిస్టెన్స్‌ను పక్కనబెడితే, జనాలు గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా మరణాల సంఖ్య ఇంతకు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.

అమెరికాలో ఇప్పటిదాకా 6 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 30 వేల మందికి పైగా మరణించారు. కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం, కరోనా నుంచి కోలుకున్న చైనాలో మళ్లీ కొత్త కేసులు నమోదు అవుతుండడంతో కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా రెండేళ్ల పాటు సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు.

This post was last modified on April 18, 2020 8:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

29 minutes ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

45 minutes ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

1 hour ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

2 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

3 hours ago

అసలు విషయం దాచేసిన రావిపూడి

నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…

3 hours ago