2022 వరకు సోషల్ డిస్టాన్సింగ్ తప్పదా?

ముట్టుకుంటే అంటుకునే రోగాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. కానీ ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడేలా చేసిన ఘనత మాత్రం కరోనా వైరస్‌కే దక్కుతుంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ‘సోషల్ డిస్టెన్స్’ మంత్రం జపిస్తోంది.

అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం మళ్లీ మామూలు పరిస్థితులు రావాలంటే మరో రెండేళ్లే పాటు సామాజిక దూరం పాటించాల్సిందేనట.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిన కరోనా వైరస్‌ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ కట్టడికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. కరోనా వైరస్‌కు ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు అన్నిదేశాల శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు మరో 18 నెలల సమయం పడుతుందని అంచనా. అప్పటిదాకా ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే కరోనా కట్టడిని నిలువరించాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటేదారి. కాబట్టి 2022 దాకా మనిషికి, మనిషికి మధ్య అంతరం ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు.

ఒకవేళ సోషల్ డిస్టెన్స్‌ను పక్కనబెడితే, జనాలు గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా మరణాల సంఖ్య ఇంతకు రెండింతలు పెరిగే ప్రమాదం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.

అమెరికాలో ఇప్పటిదాకా 6 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 30 వేల మందికి పైగా మరణించారు. కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం, కరోనా నుంచి కోలుకున్న చైనాలో మళ్లీ కొత్త కేసులు నమోదు అవుతుండడంతో కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా రెండేళ్ల పాటు సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు.

This post was last modified on April 18, 2020 8:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సౌత్ బెస్ట్ వెబ్ సిరీస్… సీక్వెల్ వస్తోంది

ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…

54 minutes ago

చంద్ర‌బాబుకు ష‌ర్మిల విన్న‌పం.. విష‌యం ఏంటంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర విన్న‌పం చేశారు. త‌ర‌చుగా కేం ద్రంపై…

1 hour ago

నెక్స్ట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల వంతు!

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…

1 hour ago

బుల్లిరాజు ఎంత పాపులరైపోయాడంటే..

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…

2 hours ago

రామ్ చరణ్ 18 కోసం కిల్ దర్శకుడు ?

గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…

2 hours ago

వేలంటైన్స్ డే.. పాత సినిమాలదే పైచేయి?

ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…

2 hours ago