Trends

హిజాబ్ కన్నా చదువే ముఖ్యం

హిజాబ్ కన్నా ముస్లింలకు చదువులే ముఖ్యమని ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) చెప్పింది. విద్యాసంస్దల్లో హిజాబ్ ధరించామా లేదా అన్న విషయం కన్నా చక్కగా చదువుకునే విషయంపైనే ముస్లిం అమ్మాయిలు దృష్టి పెట్టాలని ఎంఆర్ఎం కీలక నేతలు హితవుచెప్పారు. పిల్లల భవిష్యత్తుకు హిజాబ్ కన్నా చదువే ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జాతీయ కన్వీనర్ అధికార ప్రతినిధి షాహిద్ సయూద్ తెలిపారు.

కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకి ఎంతగా వివాదాస్పదమవుతోందో అందరు చూస్తున్నదే. దాదాపు పది రాష్ట్రాల్లోని వందలాది విద్యాసంస్ధల్లో హిజాబ్ వివాదం అట్టుడికిపోతోంది. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆర్ఎస్ఎస్  అనుబంధ సంస్ధన్న విషయం అందరికీ తెలిసిందే. హిజాబ్ విషయంలో ముస్లింలు ఛాందస భావాలనుండి బయటపడి అభ్యుదయ పథంలో ఆలోచించాలన్నారు.

భారత ముస్లింల్లో గ్రాడ్యుయేట్లు కేవలం 2.3 శాతం మాత్రమే ఎందుకున్నారనే విషయాన్ని అందరు ఆలోచించాలన్నారు. 43 శాతం అక్షరాస్యతున్న భారత ముస్లింల్లో నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగిపోతోందన్న విషయాన్ని అందరు గ్రహించాలన్నారు. దేశంలోని విద్యాసంస్ధల్లోని డ్రాపవుట్లలో అత్యధికం ముస్లింలే ఉన్నట్లు సయూద్ చెప్పారు.  20 కోట్ల ముస్లింల జనాభాలో విద్యావంతుల సంఖ్య ఎందుకింత తక్కువగా ఉందో ముస్లిం పెద్దలు ఆలోచించాలని సయూద్ పిలుపిచ్చారు.

నరేంద్రమోడి సర్కార్ రద్దుచేసిన త్రిబుల్ తలాక్ కారణంగానే ఎంతోమంది ముస్లిం మహిళలకు ఊరటనిచ్చిన విషయం అందరు గ్రహించాలన్నారు. హిజాబ్ వివాదంతో కాలాన్ని  వృధా చేసుకునే కన్నా అందరు చదువుపైనే ఎక్కువ దృష్టిపెడితే అందరికీ మంచిదని హితవు పలికారు. హిజాబ్ ధరించటం, ధరించకపోవటం వల్ల ముస్లిం యువతుల భవిష్యత్తు ఏ విధంగా మారదని,  మంచి భవిష్యత్తు కేవలం చదువుకుంటే మాత్రమే వస్తుందని సయీద్ తెలిపారు. మరి ముస్లిం రాష్ట్రీయ మంచ్ హితవు తర్వాతైనా ముస్లిం సమాజంలో మార్పొ వస్తుందేమో చూడాలి. 

This post was last modified on February 20, 2022 7:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

52 seconds ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

55 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

1 hour ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

2 hours ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

3 hours ago