Trends

హిజాబ్ కన్నా చదువే ముఖ్యం

హిజాబ్ కన్నా ముస్లింలకు చదువులే ముఖ్యమని ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) చెప్పింది. విద్యాసంస్దల్లో హిజాబ్ ధరించామా లేదా అన్న విషయం కన్నా చక్కగా చదువుకునే విషయంపైనే ముస్లిం అమ్మాయిలు దృష్టి పెట్టాలని ఎంఆర్ఎం కీలక నేతలు హితవుచెప్పారు. పిల్లల భవిష్యత్తుకు హిజాబ్ కన్నా చదువే ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జాతీయ కన్వీనర్ అధికార ప్రతినిధి షాహిద్ సయూద్ తెలిపారు.

కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకి ఎంతగా వివాదాస్పదమవుతోందో అందరు చూస్తున్నదే. దాదాపు పది రాష్ట్రాల్లోని వందలాది విద్యాసంస్ధల్లో హిజాబ్ వివాదం అట్టుడికిపోతోంది. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆర్ఎస్ఎస్  అనుబంధ సంస్ధన్న విషయం అందరికీ తెలిసిందే. హిజాబ్ విషయంలో ముస్లింలు ఛాందస భావాలనుండి బయటపడి అభ్యుదయ పథంలో ఆలోచించాలన్నారు.

భారత ముస్లింల్లో గ్రాడ్యుయేట్లు కేవలం 2.3 శాతం మాత్రమే ఎందుకున్నారనే విషయాన్ని అందరు ఆలోచించాలన్నారు. 43 శాతం అక్షరాస్యతున్న భారత ముస్లింల్లో నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగిపోతోందన్న విషయాన్ని అందరు గ్రహించాలన్నారు. దేశంలోని విద్యాసంస్ధల్లోని డ్రాపవుట్లలో అత్యధికం ముస్లింలే ఉన్నట్లు సయూద్ చెప్పారు.  20 కోట్ల ముస్లింల జనాభాలో విద్యావంతుల సంఖ్య ఎందుకింత తక్కువగా ఉందో ముస్లిం పెద్దలు ఆలోచించాలని సయూద్ పిలుపిచ్చారు.

నరేంద్రమోడి సర్కార్ రద్దుచేసిన త్రిబుల్ తలాక్ కారణంగానే ఎంతోమంది ముస్లిం మహిళలకు ఊరటనిచ్చిన విషయం అందరు గ్రహించాలన్నారు. హిజాబ్ వివాదంతో కాలాన్ని  వృధా చేసుకునే కన్నా అందరు చదువుపైనే ఎక్కువ దృష్టిపెడితే అందరికీ మంచిదని హితవు పలికారు. హిజాబ్ ధరించటం, ధరించకపోవటం వల్ల ముస్లిం యువతుల భవిష్యత్తు ఏ విధంగా మారదని,  మంచి భవిష్యత్తు కేవలం చదువుకుంటే మాత్రమే వస్తుందని సయీద్ తెలిపారు. మరి ముస్లిం రాష్ట్రీయ మంచ్ హితవు తర్వాతైనా ముస్లిం సమాజంలో మార్పొ వస్తుందేమో చూడాలి. 

This post was last modified on February 20, 2022 7:01 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…

9 mins ago

మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ…

6 hours ago

వీరమల్లు నిర్మాతకు గొప్ప ఊరట

ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…

7 hours ago

ఇళయరాజాకు ఇది తగునా?

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…

8 hours ago

నా రెండో సంత‌కం ఆ ఫైలు పైనే: చంద్ర‌బాబు

కూట‌మి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనేన‌ని.. దీనివ‌ల్ల 20 వేల మంది నిరుద్యోగుల‌కు మేలు…

8 hours ago

పదిహేనేళ్ల మాట తీర్చిన SSMB 29

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…

9 hours ago