ఇప్పటికే టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీని విడిచిపెట్టాడు విరాట్ కోహ్లి. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కూడా పోయింది. ఐతే వన్డే కెప్టెన్గా గొప్ప రికార్డును కోహ్లిని ఎందుకు కెప్టెన్గా తప్పించారు.. ఒకవేళ తప్పదనుకుంటే కోహ్లి స్థాయి ఆటగాడిపై ఇలా వేటు వేయడం ఏంటి.. గౌరవప్రదంగా తప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అన్నది అభిమానుల వాదన. నిజానికి కోహ్లి వన్డే కెప్టెన్సీ రికార్డు గొప్పగా ఉంది. 95 మ్యాచుల్లో అతను జట్టుకు నాయకత్వం వహిస్తే.. 65 మ్యాచుల్లో ఇండియా గెలిచింది. అతడి కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజ్ 70.43 కావడం విశేషం.
90కి పైగా మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన ఆటగాళ్లలో పాంటింగ్ (76.14 శాతం), క్రానె (73.70 శాతం) మాత్రమే కోహ్లి కంటే మెరుగైన కెప్టెన్సీ రికార్డు కలిగి ఉన్నారు. ధోని సైతం విరాట్ కంటే వెనుక ఉన్నాడు. కాకపోతే ఇప్పటిదాకా ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా సాధించలేకపోవడమే కోహ్లికున్న మైనస్. ఐపీఎల్లోనూ ఆర్సీబీ జట్టుకు ట్రోఫీ అందించలేకపోవడం అతడికి మైనస్ అయింది.
ఆ లీగ్లో ముంబయికి ఐదు టైటిళ్లు అందించడం, భారత జట్టుకు తాత్కాలికంగా కెప్టెన్గా వ్యవహరించినపుడు ఆకట్టుకోవడం రోహిత్కు ప్లస్ అయింది. ఇప్పటికే టీ20లకు రోహిత్ కెప్టెన్ అయిన నేపథ్యంలో.. ఆ ఫార్మాట్కు అతణ్ని, వన్డేలకు కోహ్లిని కెప్టెన్గా పెట్టడం బాగుండదని, రెంటికీ ఒకరే సారథిగా ఉండాలని రోహిత్ను ఎంపిక చేశారన్నది స్పష్టం.ఐతే ఇప్పుడు చర్చ.. కోహ్లిని సెలక్టర్లు అవమానించారు అనే దాని మీదే నడుస్తోంది. కానీ ఇందులో సెలక్టర్లను తప్పుబట్టడానికేమీ లేదన్నది బీసీసీఐ వర్గాల సమాచారం. టీ20లకు ఒకరిని, వన్డేలకు ఒకరిని కెప్టెన్గా పెడితే బాగుండదన్న ఉద్దేశంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని సెలక్టర్లు కోహ్లికి సూచించారట.
ఇందుకు రెండు రోజుల గడువు కూడా ఇచ్చారట. తనంతట తనే రాజీనామా చేస్తాడని ఎదురు చూడగా.. కోహ్లి నుంచి స్పందన లేదట. దీంతో మరో మార్గం లేక అతడిపై వేటు వేసి రోహిత్ను కెప్టెన్గా ప్రకటించారట. నిజానికి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు జట్టును ప్రకటిస్తూ.. వన్డే కెప్టెన్ను మారుస్తున్నట్లు ప్రకటించడానికి కారణం కూడా ఇదేనట. ఈ సందర్భంగా సెలక్టర్లు కోహ్లిని తప్పిస్తున్నట్లు కూడా చెప్పలేదు. నేరుగా రోహిత్ వన్డే కెప్టెన్ అని ప్రకటన మాత్రమే చేశారు. కోహ్లి తీరు నచ్చకే ఇలా చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ పరిణామాలు చూస్తే భారత క్రికెట్లో కోహ్లి హవాకు తెరపడినట్లే కనిపిస్తోంది.
This post was last modified on December 9, 2021 2:36 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…