చికిత్స సంగతి ఎలా ఉన్నా.. బిల్లు కట్టించుకునే విషయంలో ఆసుపత్రులు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మనిషి ప్రాణం పోయినా.. బిల్లు లెక్క తేలే వరకూ డెడ్ బాడీని ఇచ్చేందుకు సైతం ఒప్పుకోని దవాఖానాల గురించి తెలిసిందే.
తాజాగా.. ఒక ఆసుపత్రి వ్యవహారం షాకింగ్ గా మారింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.సదరు ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్ గర్ జిల్లాకు చెందిన 80 ఏళ్ల పెద్ద వయస్కుడికి పేగు సంబంధిత వ్యాధితో షాజాపూర్ లోని సిటీ హాస్పిటల్ లో చేరారు. చికిత్స పూర్తి అయిన తర్వాత ఆసుపత్రి వారు వేసిన బిల్లు చూసిన ఆయన కుటుంబ సభ్యులకు చుక్కలు కనిపించాయి. అంత డబ్బు లేదని.. బిల్లు విషయంలో కాస్త తగ్గించాలని వేడుకున్నారు. తాము చెప్పిన బిల్లును కట్టకుంటే డిశ్చార్జ్ చేసే ప్రసక్తే లేదని తేల్చిన ఆసుపత్రి యాజమాన్యం దారుణానికి పాల్పడింది.
బిల్లు కట్టలేదన్న కారణంగా పేషెంట్ ను తాళ్లతో కట్టేసింది. పెద్ద వయసు దానికితోడు అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోని ఆసుపత్రి చర్యతో అవాక్కు అయ్యారు. అయితే.. ఈ తాళ్లతో కట్టేసిన ఫోటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోను చూసినోళ్లంతా షాక్ కు గురయ్యే పరిస్థితి. ఆసుపత్రుల ఆరాచకానికి నిలువెత్తు రూపంగా ఈ ఫోటో ఉందన్న మాట వినిపిస్తోంది.
ఈ ఫోటోను చూసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇస్తూ.. సదరు పేషెంట్ బకాయిల్లో ఒక్కరూపాయి కూడా తీసుకోకుండానే డిశ్చార్జి చేసినట్లుగా ట్వీట్ చేసింది. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడిలా వివరణ ఇవ్వటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…