చికిత్స సంగతి ఎలా ఉన్నా.. బిల్లు కట్టించుకునే విషయంలో ఆసుపత్రులు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మనిషి ప్రాణం పోయినా.. బిల్లు లెక్క తేలే వరకూ డెడ్ బాడీని ఇచ్చేందుకు సైతం ఒప్పుకోని దవాఖానాల గురించి తెలిసిందే.
తాజాగా.. ఒక ఆసుపత్రి వ్యవహారం షాకింగ్ గా మారింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.సదరు ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్ గర్ జిల్లాకు చెందిన 80 ఏళ్ల పెద్ద వయస్కుడికి పేగు సంబంధిత వ్యాధితో షాజాపూర్ లోని సిటీ హాస్పిటల్ లో చేరారు. చికిత్స పూర్తి అయిన తర్వాత ఆసుపత్రి వారు వేసిన బిల్లు చూసిన ఆయన కుటుంబ సభ్యులకు చుక్కలు కనిపించాయి. అంత డబ్బు లేదని.. బిల్లు విషయంలో కాస్త తగ్గించాలని వేడుకున్నారు. తాము చెప్పిన బిల్లును కట్టకుంటే డిశ్చార్జ్ చేసే ప్రసక్తే లేదని తేల్చిన ఆసుపత్రి యాజమాన్యం దారుణానికి పాల్పడింది.
బిల్లు కట్టలేదన్న కారణంగా పేషెంట్ ను తాళ్లతో కట్టేసింది. పెద్ద వయసు దానికితోడు అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోని ఆసుపత్రి చర్యతో అవాక్కు అయ్యారు. అయితే.. ఈ తాళ్లతో కట్టేసిన ఫోటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోను చూసినోళ్లంతా షాక్ కు గురయ్యే పరిస్థితి. ఆసుపత్రుల ఆరాచకానికి నిలువెత్తు రూపంగా ఈ ఫోటో ఉందన్న మాట వినిపిస్తోంది.
ఈ ఫోటోను చూసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇస్తూ.. సదరు పేషెంట్ బకాయిల్లో ఒక్కరూపాయి కూడా తీసుకోకుండానే డిశ్చార్జి చేసినట్లుగా ట్వీట్ చేసింది. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడిలా వివరణ ఇవ్వటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
This post was last modified on June 8, 2020 1:15 pm
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…