చికిత్స సంగతి ఎలా ఉన్నా.. బిల్లు కట్టించుకునే విషయంలో ఆసుపత్రులు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. మనిషి ప్రాణం పోయినా.. బిల్లు లెక్క తేలే వరకూ డెడ్ బాడీని ఇచ్చేందుకు సైతం ఒప్పుకోని దవాఖానాల గురించి తెలిసిందే.
తాజాగా.. ఒక ఆసుపత్రి వ్యవహారం షాకింగ్ గా మారింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.సదరు ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్ గర్ జిల్లాకు చెందిన 80 ఏళ్ల పెద్ద వయస్కుడికి పేగు సంబంధిత వ్యాధితో షాజాపూర్ లోని సిటీ హాస్పిటల్ లో చేరారు. చికిత్స పూర్తి అయిన తర్వాత ఆసుపత్రి వారు వేసిన బిల్లు చూసిన ఆయన కుటుంబ సభ్యులకు చుక్కలు కనిపించాయి. అంత డబ్బు లేదని.. బిల్లు విషయంలో కాస్త తగ్గించాలని వేడుకున్నారు. తాము చెప్పిన బిల్లును కట్టకుంటే డిశ్చార్జ్ చేసే ప్రసక్తే లేదని తేల్చిన ఆసుపత్రి యాజమాన్యం దారుణానికి పాల్పడింది.
బిల్లు కట్టలేదన్న కారణంగా పేషెంట్ ను తాళ్లతో కట్టేసింది. పెద్ద వయసు దానికితోడు అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోని ఆసుపత్రి చర్యతో అవాక్కు అయ్యారు. అయితే.. ఈ తాళ్లతో కట్టేసిన ఫోటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోను చూసినోళ్లంతా షాక్ కు గురయ్యే పరిస్థితి. ఆసుపత్రుల ఆరాచకానికి నిలువెత్తు రూపంగా ఈ ఫోటో ఉందన్న మాట వినిపిస్తోంది.
ఈ ఫోటోను చూసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇస్తూ.. సదరు పేషెంట్ బకాయిల్లో ఒక్కరూపాయి కూడా తీసుకోకుండానే డిశ్చార్జి చేసినట్లుగా ట్వీట్ చేసింది. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడిలా వివరణ ఇవ్వటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
This post was last modified on June 8, 2020 1:15 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…