నందమూరి బాలకృష్ణ… ఏదైనా ప్రత్యేకించి సినిమా కార్యక్రమాల మీద తప్పించి మరెక్కడా అనవసరంగా మైకుల ముందుకు వచ్చి మాట్లాడానికి తాపత్రయపడడు. అనుకోకుండా ఓ తెలంగాణ ముఖ్యమంత్రితో మీటింగ్ సరిగ్గా బాలకృష్ణ పుట్టిన రోజుకు ఒక పది రోజుల ముందు జరగడం, దానికి బాలకృష్ణకు ఆహ్వానం రాకపోవడం, ఇది 60వ పుట్టిన రోజు కావడంతో అన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తుండటంతో ఆ వివాదం పదేపదే చర్చకు వస్తోంది. ప్రతి మీడియా దాని గురించి అడగడం, మళ్లీ బాలకృష్ణ స్పందించడం కామన్ అయిపోయింది. అయితే, తాజాగా దీనికి భిన్నమైన ఒక పాజిటివ్ న్యూస్ అందరినీ ఆకర్షిస్తోంది. అది బాలకృష్ణ – రోజా మీటింగ్ గురించి వార్త.
బాలయ్య సినిమాల సంగతి పక్కన పెడితే… ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా ఉంటారని చెబుతుంటారు. ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. టీడీపీ దారుణంగా ఓడిన సందర్భంలో… ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మెజారిటీ కూడా తగ్గగా… బాలయ్య ఇమేజ్ మాత్రం పెరిగింది.
2014 ఎన్నికల కంటే 2019లో ఎక్కువ మెజారిటీతో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు నందమూరి బాలకృష్ణ. అతను ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, మంచినీరు, సాగునీరు ఇవ్వడం, ఉపాధి కల్పన ఇలా పలు అంశాల్లో శ్రద్ద తీసుకుంటారట. అందుకే ప్రజలు ఆయనకు మరింత దగ్గరయ్యారట. బాలయ్య గురించిన తాజా వార్త గురించి కూడా దీనిని ఖరారు చేసేలాగానే ఉంది.
వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా తన నియోజకవర్గమైన హిందూపురం అభివృద్ధి కోసం బాలకృష్ణ ప్రయత్నాలు మానలేదు. తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజాను బాలకృష్ణ ఓ సాయం అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే వెల్లడించారు.
హిందూపురం నియోజకవర్గాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేశానని… పరిశ్రమల విషయంలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు వస్తాయని, అందుకే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం ఏపీఐఐసీ చైర్మన్ రోజాతో ప్రత్యేకంగా కలవనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. రోజా కూడా ఈ విషయం పట్ల సానుకూలంగానే స్పందించారని బాలకృష్ణ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత దీనిపై చర్చించేందుకు విజయవాడ రావాలని రోజా చెప్పారని, అధికారులతో కలిసి దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని రోజా చెప్పినట్టు బాలకృష్ణ తెలిపారు.
రోజాకి టీడీపీ అంటే బద్ధ శత్రువులా భావిస్తున్నా… మొన్న మండలిలో అంత వివాదాంలోను వీరిద్దరు కలిసి నవ్వుతూ దిగిన ఓ సెల్ఫీ పాపులర్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి సానుకూల సంబంధాలే ఉన్నట్లు అర్థమవుతోంది.
This post was last modified on June 8, 2020 11:00 am
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…