భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ చరిత్రాత్మక ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా అజాజ్ రికార్డు సృష్టించాడు. అయితే, కివీస్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఓ వైపు అజాజ్ ప్రదర్శనతో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్న కివీస్…మరోవైపు భారత్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అపప్రదను మూటగట్టుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 62 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ కుదేలయ్యారు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆరంభంలో పర్యాటక జట్టును 3 వికెట్లతో హైదరాబాదీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సిరాజ్ దెబ్బతీశాడు. ఆ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్లు చెలరేగారు. రవిచంద్రన్ అశ్విన్ 8 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి న్యూజిల్యాండ్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
ఇక, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ 1 వికెట్ తీశారు. కివీస్ బ్యాట్స్ మెన్లలో టామ్ లాథమ్, జేమిసన్ మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 263 పరుగుల ఆధిక్యం లభించడంతో కివీస్ కు ఫాలో ఆన్ తప్పలేదు. అయితే, అనూహ్యంగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. మూడో రోజు పిచ్ మరింతగా బౌలింగ్ కు అనుకూలించే అవకాశముండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
This post was last modified on December 4, 2021 4:47 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…