Trends

కుప్పుకూలిన కివీస్..చెత్త రికార్డు

భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ చరిత్రాత్మక ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా అజాజ్ రికార్డు సృష్టించాడు. అయితే, కివీస్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఓ వైపు అజాజ్ ప్రదర్శనతో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్న కివీస్…మరోవైపు భారత్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అపప్రదను మూటగట్టుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 62 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ కుదేలయ్యారు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆరంభంలో పర్యాటక జట్టును 3 వికెట్లతో హైదరాబాదీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సిరాజ్ దెబ్బతీశాడు. ఆ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్లు చెలరేగారు. రవిచంద్రన్ అశ్విన్ 8 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి న్యూజిల్యాండ్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

ఇక, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ 1 వికెట్ తీశారు. కివీస్ బ్యాట్స్ మెన్లలో టామ్ లాథమ్, జేమిసన్ మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 263 పరుగుల ఆధిక్యం లభించడంతో కివీస్ కు ఫాలో ఆన్ తప్పలేదు. అయితే, అనూహ్యంగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. మూడో రోజు పిచ్ మరింతగా బౌలింగ్ కు అనుకూలించే అవకాశముండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

This post was last modified on December 4, 2021 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

23 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago