భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ చరిత్రాత్మక ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా అజాజ్ రికార్డు సృష్టించాడు. అయితే, కివీస్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఓ వైపు అజాజ్ ప్రదర్శనతో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్న కివీస్…మరోవైపు భారత్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అపప్రదను మూటగట్టుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 62 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ కుదేలయ్యారు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆరంభంలో పర్యాటక జట్టును 3 వికెట్లతో హైదరాబాదీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సిరాజ్ దెబ్బతీశాడు. ఆ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్లు చెలరేగారు. రవిచంద్రన్ అశ్విన్ 8 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి న్యూజిల్యాండ్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
ఇక, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ 1 వికెట్ తీశారు. కివీస్ బ్యాట్స్ మెన్లలో టామ్ లాథమ్, జేమిసన్ మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 263 పరుగుల ఆధిక్యం లభించడంతో కివీస్ కు ఫాలో ఆన్ తప్పలేదు. అయితే, అనూహ్యంగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. మూడో రోజు పిచ్ మరింతగా బౌలింగ్ కు అనుకూలించే అవకాశముండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
This post was last modified on December 4, 2021 4:47 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…