కొట్టడమంటే చేత్తోనో లేకపోతే కర్ర తీసుకునో కొట్టడం కాదు. సంపదలో ముఖేష్ ను అదానీ మించి పోయారని అర్ధం. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ మొదటసారి నిలిచారు. ఇప్పటివరకు ఈ ప్లేస్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉండేవారు. దాదాపు పదేళ్లుగా నెంబర్ వన్ రిచ్చెస్ట్ గా ఉన్న ముఖేష్ ప్లేసును తాజాగా అదానీ కొట్టేసినట్లు బ్లూమ్ బర్గ్ తాజా నివేదికలో ప్రకటించింది.
గడచిన ఏడాదిలో అదానీ సంపద విపరీతంగా పెరిగిపోయింది. అదానీ సంపద ఏ స్థాయిలో ఉందంటే రోజుకు సుమారు రు. వెయ్యి కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తే రు. 4.12 లక్షల కోట్లుగా తేలింది. ఇదే సమయంలో ముఖేష్ సంపద నికర విలువ రు. 1.07 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. అంటే వీరిద్దరి సంపద లో ఉన్న వ్యత్యాసమే సుమారు రు. 3 లక్షల కోట్లు. ఈ తేడా వల్లే ముఖేష్ స్ధానంలో ఆసియా నెంబర్ వన్ రిచ్చెస్ట్ ప్లేసులోకి అదానీ వచ్చి కూర్చున్నారు.
మొన్నటి వరకు అంటే మంగళవారం వరకు రిలయన్స్ అధినేత సంపద 9100 కోట్ల డాలర్లుగా ఉండేది. అదానీ సంపద విలువ 8880 కోట్ల డాలర్లు గా ఉండేది. అయితే బుధవారం నాడు షేర్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో ముఖేష్ సంపద కూడా అదే దామాషాలో పడిపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూపు షేర్ల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి చేరుకున్నాయి. దాంతో ఒక్కసారిగా అదానీకి జాక్ పాట్ కొట్టినట్లయ్యింది. వీళ్ళ సంపద విలువలు షేర్ల ధరలపైన ఆధారపడుంటుందన్న విషయం తెలిసిందే.
అదానీ గ్రూపులో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్, అదానీ పవర్స్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీల షేర్ల ధరలన్నీ మంచి ధరలు పలుకుతున్నాయి షేర్ మార్కెట్లో. షేర్లపైన పెట్టుబడులు పెట్టిన వారికి కూడా బాగా లాభాలు అందిస్తున్నాయి. దీంతోనే అదానీ ఆసియా కుబేరుల్లో మొదటిసారి నెంబర్ వన్ స్ధానంకు చేరుకున్నారు.
This post was last modified on November 25, 2021 10:45 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…