కొట్టడమంటే చేత్తోనో లేకపోతే కర్ర తీసుకునో కొట్టడం కాదు. సంపదలో ముఖేష్ ను అదానీ మించి పోయారని అర్ధం. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ మొదటసారి నిలిచారు. ఇప్పటివరకు ఈ ప్లేస్ లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉండేవారు. దాదాపు పదేళ్లుగా నెంబర్ వన్ రిచ్చెస్ట్ గా ఉన్న ముఖేష్ ప్లేసును తాజాగా అదానీ కొట్టేసినట్లు బ్లూమ్ బర్గ్ తాజా నివేదికలో ప్రకటించింది.
గడచిన ఏడాదిలో అదానీ సంపద విపరీతంగా పెరిగిపోయింది. అదానీ సంపద ఏ స్థాయిలో ఉందంటే రోజుకు సుమారు రు. వెయ్యి కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తే రు. 4.12 లక్షల కోట్లుగా తేలింది. ఇదే సమయంలో ముఖేష్ సంపద నికర విలువ రు. 1.07 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. అంటే వీరిద్దరి సంపద లో ఉన్న వ్యత్యాసమే సుమారు రు. 3 లక్షల కోట్లు. ఈ తేడా వల్లే ముఖేష్ స్ధానంలో ఆసియా నెంబర్ వన్ రిచ్చెస్ట్ ప్లేసులోకి అదానీ వచ్చి కూర్చున్నారు.
మొన్నటి వరకు అంటే మంగళవారం వరకు రిలయన్స్ అధినేత సంపద 9100 కోట్ల డాలర్లుగా ఉండేది. అదానీ సంపద విలువ 8880 కోట్ల డాలర్లు గా ఉండేది. అయితే బుధవారం నాడు షేర్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో ముఖేష్ సంపద కూడా అదే దామాషాలో పడిపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూపు షేర్ల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి చేరుకున్నాయి. దాంతో ఒక్కసారిగా అదానీకి జాక్ పాట్ కొట్టినట్లయ్యింది. వీళ్ళ సంపద విలువలు షేర్ల ధరలపైన ఆధారపడుంటుందన్న విషయం తెలిసిందే.
అదానీ గ్రూపులో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్, అదానీ పవర్స్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీల షేర్ల ధరలన్నీ మంచి ధరలు పలుకుతున్నాయి షేర్ మార్కెట్లో. షేర్లపైన పెట్టుబడులు పెట్టిన వారికి కూడా బాగా లాభాలు అందిస్తున్నాయి. దీంతోనే అదానీ ఆసియా కుబేరుల్లో మొదటిసారి నెంబర్ వన్ స్ధానంకు చేరుకున్నారు.
This post was last modified on November 25, 2021 10:45 am
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…