Trends

ఒత్తిడే కొంపముంచిందా ?

ఇపుడిదే ప్రశ్న ప్రపంచంలోని భారత్ అభిమానులను పట్టి పీడిస్తోంది. టీ20 ప్రపంచ కప్ లో మొట్టమొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో భారత్ ఓడిపోవటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకోతున్నారు. ఆటలన్నాక గెలుపులోములు సహజమే. కానీ ఓటమి ఎంత గౌరవప్రదంగా ఉందనేది చాలా కీలకం. పాకిస్తాన్ పై భారత్ ఘోరంగా ఓడిపోయింది. అలా ఇలా కాదు ఇటు మొదట బ్యాటింగ్ లో తర్వాత బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది.

ఒకళ్ళో ఇద్దరో కాదు మొత్తానికి మొత్తం జట్టులోని 11 మంది సమిష్టి వైఫల్యం వల్లే చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోర ఓటమి ఎదురైంది. మొదటి బ్యాటింగ్ చేసిన మన జట్టు బ్యాట్స్ మెన్ పూర్తి నిర్లక్ష్యంతో ఆడారు. అనవసరంగా తమ వికెట్లను పారేసుకున్నారు. పాకిస్తాన్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది వాస్తవమే. కానీ వాళ్ళ బౌలింగ్ ఆడలేనంత భయకరంగా అయితే లేదు. మన బ్యాట్స్ మెన్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్లను పారేసుకున్నారంతే.

రిషబ్ పంత్ ను కనుక విరాట్ కోహ్లీ కంట్రోల్ లో పెట్టుంటే మరో 20 పరుగులు అదనంగా వచ్చుండేవి. పంత్ బ్యాటింగ్ కు వచ్చిన దగ్గర నుంచి కాన్ఫిడెంట్ గా ఒక్క స్ట్రోక్ కూడా ఆడలేదు. మొదటి నుండి చాలా అసహనంగానే కదులుతు మొత్తానికి 39 పరుగులు చేశాడు. గబ గబా ఆడాలన్న ఆతృతలోనే తన వికెట్ ను సమర్పించుకున్నాడు. కోహ్లీ గనుక పంత్ ను కాస్త కంట్రోల్ చేసుంటే మరిన్ని పరుగులు వచ్చేవే. మొదట్లో కోహ్లీ కూడా పరుగుల కోసం కష్టపడ్డాడు. తర్వాత పుంజుకుని 57 పరుగులు చేశాడు.

బ్యాట్స్ మెన్ లో మొదటి నలుగురు నిర్లక్ష్యంగా ఆడటం వల్లే అవుటయ్యారు. అప్పటికీ 151 పరుగులు చేయటమంటే కాస్త గౌరవప్రదమైన స్కోర్ కిందే లెక్క. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్క బౌలర్ కూడా పాక్ బ్యాట్స్ మెన్ పై ఏ దశలో కూడా ఒత్తిడి తేలేకపోయారు. పాక్ బౌలర్లేమో ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ పెట్టుకుని ఆఫ్ స్టంప్ లక్ష్యంగా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో మన బౌలర్లు లెగ్ స్టంప్ మీద వేసి పదే పదే పరుగులు సమర్పించుకున్నారు. 10 వికెట్ల విజయం సాధించిందంటే పాక్ బ్యాట్స్ మెన్ ఎంత చక్కగా ఆడారో అర్థమైపోతోంది.

లెట్ స్టంప్ మీద బాల్స్ వేస్తే ఎలాంటి బ్యాట్స్ మన్ అయినా పరుగులు ఈజీగా చేస్తారు. ఇంత చిన్న విషయం కూడా వందలాది మ్యాచులు ఆడిన మన బౌలర్లకు తెలీకపోవటమే ఆశ్చర్య. కెప్టెన్ కూడా బౌలర్లను నియంత్రించినట్లు కనబడలేదు. హోలు మొత్తం మీద ఎలా ఆడకూడదో అలా ఆడి ఘోరంగా ఓడిపోయారు. సరే ఇంతటితో ఏమీ అయిపోలేదు. ఎందుకంటే ఓడిపోయింది మొదటి మ్యాచే కాబట్టి నష్టం లేదు. ఎందుకంటే ఇంకా నాలుగు మ్యాచులున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్నింటినీ ఆడి గెలిస్తే దర్జాగా సెమీఫైనల్స్ కు చేరుకోవచ్చు.

This post was last modified on October 25, 2021 2:44 pm

Share

Recent Posts

యాక్షన్ కు రియాక్షన్ – తాట తీసిన పోలీసులు

రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…

2 hours ago

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

9 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

9 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

9 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

10 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

12 hours ago