ఇప్పుడు క్రికెట్ అంతా చాలా దూకుడుగా సాగిపోతోంది. ఆటగాళ్లు మైదానంలో, బయటా చాలా దూకుడుగానే ఉంటున్నారు. భారత క్రికెట్కు సంబంధించి అత్యంత దూకుడుగా కనిపించే యువ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్య ఒకడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ అతడి అగ్రెషన్ ఎలా ఉంటుందో తెలిసిందే.
కాఫీ విత్ కరణ్ షోలోనే కుర్రాడి స్పీడెలాంటిదో అందరూ చూశారు. ఆ వివాదం తర్వాత మరో వ్యక్తిగత వ్యవహారంతో హార్దిక్ వార్తల్లో నిలిచాడు. సెర్బియా మోడల్ నటాషాతో అతను ప్రేమలో పడటం, కొన్ని నెలల కిందట బోట్లో విహరిస్తూ ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడగడం తెలిసిందే. మరి వీళ్లిద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారా అని అందరూ చూస్తుంటే.. ఈ జంట పెళ్లి తర్వాత జరిగే విశేషంతో మీడియాలోకి వచ్చింది. వీళ్లిద్దరూ తల్లిదండ్రులు కాబోతుండటం విశేషం.
గర్భవతి అయిన నటాషాతో కలిసి ఫొటో దిగి అభిమానులు, మీడియాతో ఈ శుభవార్త పంచుకున్నాడు హార్దిక్. నటాషా బేబీ బంప్ చూస్తే కొన్ని నెలల కిందటే ఆమె గర్భవతి అని తేలినట్లుంది. గాయం కారణంగా దాదాపు పది నెలలుగా హార్దిక్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక ఆటలోకి పునరాగమనం చేద్దామనుకుంటుండగా కరోనా-లాక్ డౌన్ వచ్చిపడ్డాయి.
తాను తండ్రి కాబోతున్నట్లు హార్దిక్ వెల్లడించగానే.. ఆట మానేసి ఖాళీ సమయంలో నువ్వు చేసింది ఇదా అంటూ ఫ్యాన్స్ కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. నటాషా ఈ ఏడాది చివర్లో బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది.
ఇక్కడ ఇంకో ట్విస్టు ఏంటంటే.. హార్దిక్ లాక్ డౌన్ టైంలోనే చడీచప్పుడు లేకుండా పెళ్లి కూడా చేసేసుకున్నాడట. పెళ్లి ఫొటోను కూడా అతను పంచుకున్నాడు. ఐపీఎల్లో ఆల్రౌండ్ మెరుపులతో వెలుగులోకి వచ్చిన పాండ్య.. కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
This post was last modified on June 1, 2020 10:53 am
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…