కొన్ని తప్పులు చోటు చేసుకున్నంతనే వెంటనే స్పందించి.. అందుకు తగ్గ పరిహారాన్ని అందిస్తే.. ఇష్యూ అక్కడితో ముగిసిపోతుంది. అందుకు భిన్నంగా వ్యవహరించే నిర్లక్ష్యం.. అలక్ష్యం కొన్నిసార్లు కొంప ముంచుతుంది. తాజా ఉదంతాన్ని చూస్తే.. ఈ విషయం అర్థం కాక మానదు. ఒక మోడల్ కు హెయిర్ కటింగ్ చేసే విషయంలో దొర్లిన నిర్లక్ష్యానికి సదరు స్టార్ హోటల్ ఏకంగా రూ.2కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి. 2018 ఏప్రిల్ లో జరిగిన ఈ ఉదంతంలో.. అసలేం జరిగిందంటే..
మోడల్ గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ చెన్నైలోని ఐటీసీ మౌర్య ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేశారు. హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు హోటల్లో ఉన్న సెలూన్ కు వెళ్లారు. తనకు ఇంటర్వ్యూ ఉందని.. జుట్టును కింది నుంచి నాలుగు అంగుళాల వరకు కట్ చేయాలని కోరారు. హెయిర్ డ్రెస్సర్ కటింగ్ చేస్తున్న వేళ.. కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టేసింది. డ్రెస్సర్ సూచనలకు అనుగుణంగా తల కిందకు దించి ఉండిపోయారు.
కటింగ్ పూర్తి అయిన తర్వాత చూస్తే.. కింద నుంచి కాకుండా పై నుంచి నాలుగు అంగుళాలు ఉండేలా కటింగ్ చేయటంతో ఆమె షాక్ తిన్నారు. తాను చెప్పిన దానికి.. జరిగిన దానికి సంబంధం లేకపోవడంతో ఆమె హోటల్ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కంప్లైంట్ చేయగా.. వారి నుంచి సానుకూల స్పందన రాలేదు.దీంతో ఆమె నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ ను సంప్రదించారు. హోటల్ సిబ్బంది తన పట్ల ప్రవర్తించిన నిర్లక్ష్యం.. వారు ఉపయోగించిన రసాయనాల వల్ల తన స్కాల్ప్ పాడైందని కోర్టుకు తెలిపారు.
తనకు పొడవైన జట్టు ఉండటం వల్ల ప్రముఖ పెంనీలు షాంపూ యాడ్ లో నటించానని.. హోటల్ లో జరిగిన దానికి తాను ఆ ఛాన్సును మిస్ అయినట్లుగా పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనల్ని విన్న కోర్టు.. ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందిది తప్పని తేల్చింది. ఇందుకు పరిహారంగా రూ.2 కోట్ల మొత్తాన్ని బాధిత మహిళకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదంతం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మీకు ఎక్కడైనా సేవా లోపం జరిగితే.. న్యాయం కోసం పోరాడితే.. అంతో ఇంతో ఫలితం రావటం ఖాయమని చెప్పక తప్పదు.
This post was last modified on September 24, 2021 10:47 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…