2009లో శ్రీలంక క్రికెట్ జట్టు మీద ఉగ్రవాదుల దాడి జరిగాక ఏడెనిమిదేళ్ల పాటు పాకిస్థాన్లో అంతర్జాతీయ క్రికెట్ అన్నదే జరగలేదు.రక్షణ విషయంలో గ్యారెంటీ లేక శ్రీలంక మాత్రమే కాదు.. ఏ జట్టూ ఆ దేశంలో పర్యటించే సాహసం చేయలేదు. దీంతో తాము ఆతిథ్యం ఇవ్వాల్సిన సిరీస్లను యూఏఈ వేదికగా నిర్వహిస్తూ వచ్చింది. చివరికి పాకిస్థాన్ దేశ వాళీ క్రికెట్ లీగ్ పీఎస్ఎల్ను సైతం యూఏఈలోనే జరుపుకోవాల్సి వచ్చింది.
ఐతే స్వదేశంలో మళ్లీ సిరీస్లు, లీగ్లు జరిపించేందుకు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నం ఫలించి గత రెండేళ్ల నుంచే కొన్ని చిన్న జట్లు ఆ దేశంలో పర్యటించాయి. ఇప్పుడు న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆ దేశానికి రావడంతో పాకిస్థాన్ క్రికెట్ ప్రేమికుల ఆనందానికి అవధుల్లేవు. శుక్రవారమే తొలి వన్డే జరగాల్సింది. కానీ ఈ మ్యాచే కాదు.. మొత్తం సిరీస్ రద్దయిపోయింది. న్యూజిలాండ్ జట్టు పర్యటనను రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్లిపోయి పాకిస్థాన్కు దిమ్మదిరిగే షాకిచ్చింది. భద్రత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్ వెల్లడించింది.
పాకిస్థాన్లో ప్రస్తుతం పర్యటన అంత సురక్షితం కాదని.. తమ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి న్యూజిలాండ్ ప్రభుత్వానికి హెచ్చరికలు రావడం.. ఈమేరకు జట్టుకు సమాచారం రావడంతో ఈ పర్యటనను రద్దు చేసుకుని ఆటగాళ్లు స్వదేశానికి పయనమయ్యారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో పాలుపోలేదు. అసలు సమస్యేంటో చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎలా స్వదేశానికి వెళ్లిపోతారని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. పాకిస్థాన్లో క్రికెట్ పునరుజ్జీవం దిశగా అడుగులు పడుతున్న వేళ.. న్యూజిలాండ్ నిర్ణయం ఆ దేశానికి మామూలు షాక్ కాదు. మున్ముందు మిగతా జట్లు కూడా వెనుకంజ వేయొచ్చు. కాగా ఇదంతా బీసీసీఐ చేసిన కుట్ర అంటూ పాకిస్థాన్ వాళ్లు సోషల్ మీడియాలో ఇండియా మీద పడి ఏడుస్తుండటం గమనార్హం.
This post was last modified on September 18, 2021 9:01 am
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…