ఇండియా కొత్త కేసులు 591, ఏపీ, తెలంగాణలోను తగ్గాయి !

ఇండియాలో కరోనా కేసులు 6000 మార్కు దాటింది. కాకపోతే గత 24 గంటల్లో కొత్త కేసుల పురోగతిలో కొంచెం మందగమనం కనిపించడం ఆశావహం. కరోనా లక్షణాలు బయటపడే 14 రోజుల సమయం కూడా లాక్ డౌన్ పెట్టాక దాటేశాం. అయినా కేసుల సంఖ్య తక్కువగానే నమోదు కావడం ఆశను పెంచింది.

ఇప్పటివరకు దేశంలో లక్ష 30 వేల టెస్టులు చేయగా 6000 మందికి ఇది సోకినట్లు నిర్దారణ అయ్యింది. నిన్నటికి 700 పైగా పెరిగిన కేసులు నేడు 591 వద్ద నమోదయ్యాయి.
ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 5865 గా ఉంది. ఇది డిశ్చార్జి అయిన 478 మందితో కలిపి వేసిన సంఖ్య. మరో 169 మంది మరణించారు. మరణించిన వారితో కలుపుకుంటే ఇండియా 6 వేల మార్క్ దాటినట్టు.

ఇక తెలంగాణలో కొత్తగా 18 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 471 కి పెరిగింది. రేపటి నుంచి కొత్త కేసులు ఉండకపోవచ్చని మంత్రి ఈటల చాలా దీమాగా చెప్పారు. ఇప్పటికే తబ్లిగి కి వెళ్లొచ్చిన వారందరికీ టెస్టులు పూర్తవడం వల్ల గవర్నమెంటు కాన్ఫిడెన్సుతో ఉంది.  కొత్త మరణం ఒకటి నమోదైంది. ఈటల ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఏప్రిల్ 22 నాటికి మొత్తం అందరూ కోలుకుంటారని చెప్పారు.

ఏపీలో ఉదయం ప్రకటించిన బులిటెన్లో 217 శాంపిల్స్ చెక్ చేసినా ఒక్క కొత్త కేసు కూడా లేదని గుడ్ న్యూస్ చెప్పింది. కానీ సాయంత్రం బులిటెన్ లో కొత్తగా 15 కేసులు నమోదైనట్టు ఏపీ ప్రకటించింది. వీటిలో ప్రకాశం జిల్లాలో 11 గుంటూరులో 2, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో గాని, దేశంలో గాని కరోనా తీవ్రత కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కాకపోతే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లో మాత్రం కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి.

This post was last modified on April 9, 2020 6:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago