ఇండియా కొత్త కేసులు 591, ఏపీ, తెలంగాణలోను తగ్గాయి !

ఇండియాలో కరోనా కేసులు 6000 మార్కు దాటింది. కాకపోతే గత 24 గంటల్లో కొత్త కేసుల పురోగతిలో కొంచెం మందగమనం కనిపించడం ఆశావహం. కరోనా లక్షణాలు బయటపడే 14 రోజుల సమయం కూడా లాక్ డౌన్ పెట్టాక దాటేశాం. అయినా కేసుల సంఖ్య తక్కువగానే నమోదు కావడం ఆశను పెంచింది.

ఇప్పటివరకు దేశంలో లక్ష 30 వేల టెస్టులు చేయగా 6000 మందికి ఇది సోకినట్లు నిర్దారణ అయ్యింది. నిన్నటికి 700 పైగా పెరిగిన కేసులు నేడు 591 వద్ద నమోదయ్యాయి.
ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 5865 గా ఉంది. ఇది డిశ్చార్జి అయిన 478 మందితో కలిపి వేసిన సంఖ్య. మరో 169 మంది మరణించారు. మరణించిన వారితో కలుపుకుంటే ఇండియా 6 వేల మార్క్ దాటినట్టు.

ఇక తెలంగాణలో కొత్తగా 18 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 471 కి పెరిగింది. రేపటి నుంచి కొత్త కేసులు ఉండకపోవచ్చని మంత్రి ఈటల చాలా దీమాగా చెప్పారు. ఇప్పటికే తబ్లిగి కి వెళ్లొచ్చిన వారందరికీ టెస్టులు పూర్తవడం వల్ల గవర్నమెంటు కాన్ఫిడెన్సుతో ఉంది.  కొత్త మరణం ఒకటి నమోదైంది. ఈటల ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఏప్రిల్ 22 నాటికి మొత్తం అందరూ కోలుకుంటారని చెప్పారు.

ఏపీలో ఉదయం ప్రకటించిన బులిటెన్లో 217 శాంపిల్స్ చెక్ చేసినా ఒక్క కొత్త కేసు కూడా లేదని గుడ్ న్యూస్ చెప్పింది. కానీ సాయంత్రం బులిటెన్ లో కొత్తగా 15 కేసులు నమోదైనట్టు ఏపీ ప్రకటించింది. వీటిలో ప్రకాశం జిల్లాలో 11 గుంటూరులో 2, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో గాని, దేశంలో గాని కరోనా తీవ్రత కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కాకపోతే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లో మాత్రం కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి.

This post was last modified on April 9, 2020 6:57 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

2 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

2 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

3 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

3 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

4 hours ago

విజ‌య గంటా మోగేనా?

టీడీపీ సీనియ‌ర్ నేత గంటా శ్రీనివాస‌రావు వ‌రుస‌గా అయిదోసారి ఎమ్మెల్యేగా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…

5 hours ago