ఆనందయ్య.. ఈ పేరు తెలంగాణ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక ఆయన పంపిణీ చేస్తున్న కరోనా మందు కూడా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కరోనాను నయం చేసే మందు అంటూ అమాంతం వెలుగులోకి వచ్చిన ఆనందయ్య మందుకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయట. దీంతో.. ఆయన ఇక నుంచి ఉచితంగా కరోనా మందు పంపిణీ చేయలేనంటూ తేల్చి చెప్పేశాడు.
మందును పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు సహకరించట్లేదని, తనను నిర్భంధించేందు ప్రయత్నించిందని, ఆ తర్వాత కోర్టు అనుమతి తెచ్చుకున్నాక మందు పంపిణీ ప్రారంభించానని తెలిపారు.
అయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉచితంగా మందు ఇస్తున్నందున ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని, అందువల్ల ఇకపై కరోనా మందు ఉచితంగా ఉండే అవకాశం లేకపోవచ్చని, ప్రభుత్వ సహకారం ఉంటే ఇలా జరగదని, సాయం అందకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆనందయ్య చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on August 9, 2021 10:45 am
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…