ఆనందయ్య.. ఈ పేరు తెలంగాణ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక ఆయన పంపిణీ చేస్తున్న కరోనా మందు కూడా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో కరోనాను నయం చేసే మందు అంటూ అమాంతం వెలుగులోకి వచ్చిన ఆనందయ్య మందుకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయట. దీంతో.. ఆయన ఇక నుంచి ఉచితంగా కరోనా మందు పంపిణీ చేయలేనంటూ తేల్చి చెప్పేశాడు.
మందును పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు సహకరించట్లేదని, తనను నిర్భంధించేందు ప్రయత్నించిందని, ఆ తర్వాత కోర్టు అనుమతి తెచ్చుకున్నాక మందు పంపిణీ ప్రారంభించానని తెలిపారు.
అయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉచితంగా మందు ఇస్తున్నందున ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని, అందువల్ల ఇకపై కరోనా మందు ఉచితంగా ఉండే అవకాశం లేకపోవచ్చని, ప్రభుత్వ సహకారం ఉంటే ఇలా జరగదని, సాయం అందకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆనందయ్య చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on August 9, 2021 10:45 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…