ఈ డాక్టర్ త్యాగాన్ని చూస్తే.. దండం పెట్టాల్సిందే

కరోనా వేళ.. ఎంచక్కా ఇంట్లో కూర్చొని దేశాన్ని రక్షించాలని కోరితే.. చాలామంది ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు.. తమకు ఏదో పని ఉన్నట్లుగా చెప్పి రోడ్ల మీదకు వచ్చే వారే తప్పించి.. మూడు వారాలు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవటానికి మించిన పెద్ద శిక్ష మరొకటి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నోళ్లు ఎంతోమంది. ఇలాంటివేళ.. ఇంటిని వదిలేసి.. ప్రమాదకర వైరస్ తో నిత్యం యుద్ధం చేసే వైద్యుల జీవితాల్ని గుర్తు తెచ్చుకుంటే భయంతో వణకాల్సిందే.

కరోనా వస్తుందన్న భయాందోళనలకు గురయ్యే ఎంతోమందికి భిన్నంగా కరోనా వైరస్ ఉన్న పేషంట్లకు ట్రీట్ మెంట్ ఇవ్వటమంటే.. ల్యాండ్ మైన్ మీద కాలు వేసినట్లే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా బారిన పడక తప్పని పరిస్థితి. ఇలాంటివేళలోనూ ముప్పు గురించి ఆలోచించకుండా సేవ చేస్తున్న వైద్యులు ఎంతోమంది.

ఇదిలా ఉంటే.. మరికొందరు వైద్యులు ఒక అడుగు ముందుకు వేసి.. తీసుకుంటున్న నిర్ణయాలుచూస్తే.. రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించకమానదు. భోఫాల్ కు చెందిన వైద్యుడు ఈ కోవలోకే వస్తారు.

జేపీ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ సచిన నాయక్ కరోనా పేషంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ప్రమాదకరవైరస్ తో తానుచేస్తున్న పోరాటం కారణంగా ఇంట్లోని కుటుంబ సభ్యులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందన్న భావనతో ఆయన కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యుల్ని కలవటం లేదు. తనకు కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని కారులోనే ఉంచుకొని అందులోనే ఉంటున్నారు.

కరోనా వైరస్ చాలా సులువుగా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని.. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెబుతున్నారు. తన కారణంగా తన కుటుంబ సభ్యులు కష్టాల్లో పడకూడదన్న ఉద్దేశంతో కారునే ఇల్లుగా మార్చేసుకున్నారు. కారులో ఉండి.. పుస్తకం చదువుతున్న ఆయన ఫోటో ఇప్పడు వైరల్ గా మారింది. ఆయన త్యాగం గురించి తెలిసిన వారంతా ఆయన్ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

This post was last modified on April 9, 2020 6:57 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

నీల్ తప్ప ఎవరూ చెప్పలేని గుట్టు

గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…

2 hours ago

మరో బాహుబలి.. ట్రెండ్ సెట్ చేస్తుందా

కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…

2 hours ago

గుడ్డు-మ‌ట్టి.. మోడీపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్!

మాట‌ల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. త‌మ వ్యం గ్యాస్త్రాలు,…

2 hours ago

సమ్మర్ హీట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్

ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు  జారీచేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్‌,…

3 hours ago

కూట‌మి మేనిఫెస్టో.. సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే!

తాజాగా ఏపీలో కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీలు మేనిఫెస్టో విడుద‌ల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్ర‌బాబు చెబుతున్న…

12 hours ago

ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…

13 hours ago