లంచాలు తీసుకొని ఆస్తులు కూడపెట్టిన అధికారులను మీరు చాలా మందినే చూసుంటారు. కానీ.. ఇప్పుడు చెప్పే అధికారి మాత్రం.. లంచగుండులకే తాత. ఆయన లంచం తీసుకొని ఎంత సంపాదించాడు అనే విషయం.. కేవలం ఆయన ఇళ్లు చూస్తే సరిపోతుంది. ఆ ఇల్లు చూసి ఉన్నతాధికారులకే కళ్లు తిరిగిపోయాయి. ఇంట్లోని ఇంటరీయర్ దగ్గర నుంచి టాయ్ లెట్ వరకు మొత్తం బంగారంతోనే చేయించాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్లో ఓ అందమైన భవంతి ఉంది. ఇది కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారిది. ఆ ఇంటికి సోదాలు వెళ్ళినప్పుడు… అవాక్కవ్వడం అధికారుల వంతైంది. ఆ ఇంట్లో అన్ని బంగారంతో చేసినవవ్వడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. బెడ్రూమ్, హాలే కాదు..కిచెన్, మరుగుదొడ్డి కూడా బంగారంతో కట్టించుకోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతేకాకుండా ఫర్నీచర్, గోడకుండే ఫ్రేమ్లు, కుర్చీలు, కిచెన్లో ఉండే అలమరాలు..అంతా పుత్తడిమయమే. చివరాకరకు ఇంటరీయర్ డెకరేషన్ కూడా బంగారంతో ధగధగలాడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అధికారులు అప్లోడ్ చేశారు. 50 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో ..నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ బడా కుంభకోణంలో 35 మందికిపైగా ట్రాఫిక్ పోలీసులు భాగమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం.. అలెక్సీ, అతని కింద ఉండే ఉండే కొంత మంది అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా వాహనాలు స్టావ్రోపోల్లో ఎలాంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. అదే కేసులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాకయ్యారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడుతుందని స్థానిక మీడియోలో కథనాలు వెలువడ్డాయి.
This post was last modified on July 27, 2021 11:42 am
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…
అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…