లంచాలు తీసుకొని ఆస్తులు కూడపెట్టిన అధికారులను మీరు చాలా మందినే చూసుంటారు. కానీ.. ఇప్పుడు చెప్పే అధికారి మాత్రం.. లంచగుండులకే తాత. ఆయన లంచం తీసుకొని ఎంత సంపాదించాడు అనే విషయం.. కేవలం ఆయన ఇళ్లు చూస్తే సరిపోతుంది. ఆ ఇల్లు చూసి ఉన్నతాధికారులకే కళ్లు తిరిగిపోయాయి. ఇంట్లోని ఇంటరీయర్ దగ్గర నుంచి టాయ్ లెట్ వరకు మొత్తం బంగారంతోనే చేయించాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్లో ఓ అందమైన భవంతి ఉంది. ఇది కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారిది. ఆ ఇంటికి సోదాలు వెళ్ళినప్పుడు… అవాక్కవ్వడం అధికారుల వంతైంది. ఆ ఇంట్లో అన్ని బంగారంతో చేసినవవ్వడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. బెడ్రూమ్, హాలే కాదు..కిచెన్, మరుగుదొడ్డి కూడా బంగారంతో కట్టించుకోవడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతేకాకుండా ఫర్నీచర్, గోడకుండే ఫ్రేమ్లు, కుర్చీలు, కిచెన్లో ఉండే అలమరాలు..అంతా పుత్తడిమయమే. చివరాకరకు ఇంటరీయర్ డెకరేషన్ కూడా బంగారంతో ధగధగలాడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అధికారులు అప్లోడ్ చేశారు. 50 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో ..నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ బడా కుంభకోణంలో 35 మందికిపైగా ట్రాఫిక్ పోలీసులు భాగమైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం.. అలెక్సీ, అతని కింద ఉండే ఉండే కొంత మంది అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయా వాహనాలు స్టావ్రోపోల్లో ఎలాంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. అదే కేసులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఈ క్రమంలో విచారణ కోసం వెళ్లిన పోలీసులు.. ఆ ఇంటిని చూసి షాకయ్యారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడుతుందని స్థానిక మీడియోలో కథనాలు వెలువడ్డాయి.
This post was last modified on July 27, 2021 11:42 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…