Trends

41ఏళ్ల రికార్డు రిపీట్ చేసిన టీమిండియా..!

శ్రీలకంలో టీమిండియా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఈ జట్టు.. 3 మ్యాచుల వన్డే సిరీస్ ను ఇప్పటికే 2-0 తో గెలిచేశారు. మరోవైపు మరో టీమ్ ని ఇంగ్లాండ్ కి బీసీసీఐ పంపించింది. ఈ క్రమంలో.. టీమిండియా 41ఏళ్ల నాటి రికార్డును రిపీట్ చేసింది.

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయ‌ర్స్‌కు ఒకే వ‌న్డేలో తొలిసారి అవ‌కాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆరు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన ధావ‌న్ సేన‌.. అందులో ఐదుగురు కొత్త ప్లేయ‌ర్స్‌ను తీసుకుంది. సంజు శాంస‌న్‌తోపాటు నితీష్ రాణా, కే గౌత‌మ్‌, చేత‌న్ స‌కారియా, రాహుల్ చ‌హ‌ర్‌లు త‌మ తొలి వ‌న్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయ‌ర్స్ ఇండియా త‌ర‌ఫున అరంగేట్రం చేయ‌డం ఇది రెండోసారి మాత్ర‌మే.

తొలిసారి 1980లో ఇలా ఒకే వ‌న్డేలో ఐదుగురు కొత్త వాళ్ల‌కు అవ‌కాశ‌మిచ్చిన ఇండియ‌న్ టీమ్‌.. మ‌ళ్లీ 41 ఏళ్ల త‌ర్వాత దానిని రిపీట్ చేసింది. ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఆ మ్యాచ్‌లో 66 ప‌రుగుల‌తో టీమిండియా విజయం సాధించ‌డం విశేషం. ఇప్ప‌టికే సిరీస్ గెల‌వ‌డంతో ఈ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసింది టీమిండియా. ఇషాన్ కిష‌న్‌, కృనాల్ పాండ్యా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, దీప‌క్ చ‌హ‌ర్‌, య‌జువేంద్ర చ‌హ‌ల్‌, కుల్‌దీప్ యాద‌వ్‌లకు విశ్రాంతినిచ్చింది.

This post was last modified on July 23, 2021 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago