లవర్ బ్రేకప్ చెప్పిందని.. దేవదాసుల్లా మారిన వారిని చాలా మందినే చూసి ఉంటారు. లేదంటే.. మాజీ ప్రియురాలిపై పగ పెంచుకొని.. ఆమెను ఇబ్బంది పెట్టినవారు కూడా ఉండే ఉంటారు. ఇంకొందరు ఆ బాధ తట్టుకోలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ప్రేమలో విఫలమైన బాధ తట్టుకోలేక.. తనకు ఎలాంటి సంబంధం లేని 15కారుల ధ్వసం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
గురువారం రాత్రి వరకు బాగానే ఉన్న తమ కార్లు శుక్రవారం ఉదయం లేచేసరికి ధ్వంసమై కనిపించడంతో ఆ వాహనాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో ఓ యువకుడు కార్లను రాడ్డుతో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ప్రియురాలితో బ్రేకప్ కారణంగా తీవ్ర కుంగుబాటు, మనస్తాపానికి గురై.. ఈ పనిచేసినట్లు సదరు యువకుడు విచారణలో పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…