లవర్ బ్రేకప్ చెప్పిందని.. దేవదాసుల్లా మారిన వారిని చాలా మందినే చూసి ఉంటారు. లేదంటే.. మాజీ ప్రియురాలిపై పగ పెంచుకొని.. ఆమెను ఇబ్బంది పెట్టినవారు కూడా ఉండే ఉంటారు. ఇంకొందరు ఆ బాధ తట్టుకోలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ప్రేమలో విఫలమైన బాధ తట్టుకోలేక.. తనకు ఎలాంటి సంబంధం లేని 15కారుల ధ్వసం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
గురువారం రాత్రి వరకు బాగానే ఉన్న తమ కార్లు శుక్రవారం ఉదయం లేచేసరికి ధ్వంసమై కనిపించడంతో ఆ వాహనాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో ఓ యువకుడు కార్లను రాడ్డుతో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ప్రియురాలితో బ్రేకప్ కారణంగా తీవ్ర కుంగుబాటు, మనస్తాపానికి గురై.. ఈ పనిచేసినట్లు సదరు యువకుడు విచారణలో పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…