Trends

లవర్ బ్రేకప్ చెప్పిందని.. 15కార్లు ధ్వంసం చేసి..

లవర్ బ్రేకప్ చెప్పిందని.. దేవదాసుల్లా మారిన వారిని చాలా మందినే చూసి ఉంటారు. లేదంటే.. మాజీ ప్రియురాలిపై పగ పెంచుకొని.. ఆమెను ఇబ్బంది పెట్టినవారు కూడా ఉండే ఉంటారు. ఇంకొందరు ఆ బాధ తట్టుకోలేక బలవన్మరణానికి కూడా పాల్పడ్డారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ప్రేమలో విఫలమైన బాధ తట్టుకోలేక.. తనకు ఎలాంటి సంబంధం లేని 15కారుల ధ్వసం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

గురువారం రాత్రి వరకు బాగానే ఉన్న తమ కార్లు శుక్రవారం ఉదయం లేచేసరికి ధ్వంసమై కనిపించడంతో ఆ వాహనాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.

ఈ నేపథ్యంలో ఓ యువకుడు కార్లను రాడ్డుతో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ప్రియురాలితో బ్రేకప్‌ కారణంగా తీవ్ర కుంగుబాటు, మనస్తాపానికి గురై.. ఈ పనిచేసినట్లు సదరు యువకుడు విచారణలో పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అతడికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

This post was last modified on July 17, 2021 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

2 seconds ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

35 minutes ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

2 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

3 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

3 hours ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

6 hours ago