Trends

మోడీ డొల్లతనం బయటపెట్టిన జర్నలిస్టు మృతి


డానిష్ సిద్ధిఖి.. శుక్రవారం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పేరు. ఇతను ఒక ఫొటో జర్నలిస్టు. తన విధుల్లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌లో పర్యటిస్తున్న అతణ్ని తాలిబన్లు చంపేశారు. కేవలం ఒక ఫొటో జర్నలిస్టు చనిపోతే అతడి పేరు ఇలా ట్రెండ్ అయిపోదు. దీనికి అసలు కారణం వేరే ఉంది.

అతను కరోనా టైంలో మోడీ, ఆయన ప్రభుత్వం డొల్లతనాన్ని బయటపెట్టాడు. ప్రపంచం ముందు మోడీ చేతగానితనాన్ని బట్టబయలు చేశాడు. కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతూ.. భారత్ సురక్షితంగానే ఉందంటూ మోడీ, ఆయన ప్రభుత్వం గాంభీర్యం ప్రదర్శిస్తుంటే.. ఢిల్లీలోని ఓ శ్మశాన వాటికలో పదుల సంఖ్యలో ఒకేసారి కాలుతున్న శవాల ఫొటోలను అద్భుతమైన యాంగిల్లో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు డానిష్ సిద్ధిఖి. ఆ ఫొటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది.

ఈ ఫొటోలు మాత్రమే కాదు.. కరోనా మొదలైన కొత్తలో కనీస సమాచారం లేకుండా మోడీ సర్కారు హఠాత్తుగా లాక్ డౌన్ విధిస్తే.. దాని వల్ల వలస కార్మికులు పడుతున్న కష్టాల తాలూకు ఫొటోలు కూడా చాలానే తీశాడు డానిష్. ఒక తండ్రి బిడ్డను మెడపై పెట్టుకుని నడుస్తున్న ఫొటో వైరల్ అయింది అప్పడు. లాక్ డౌన్ టైంలో ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని, అభాగ్యుల కష్టాలను అతను కళ్లకు కట్టినట్లు చూపించాడు తన ఫొటోల ద్వారా. ఇలా జనాల్లో మంచి పేరు సంపాదించిన డానిష్‌.. మోడీ మద్దతుదారుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అతడికి బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా భయపడలేదు.

ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. డానిష్ మద్దతుదారులంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మోడీ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ చేసిన వ్యక్తి మరణాన్ని భాజపా వాళ్లు సెలబ్రేట్ చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on July 17, 2021 8:09 am

Share
Show comments

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

1 hour ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

5 hours ago