మీ వల్ల కరోనా వచ్చి పోతే మర్డర్ కేసే..

గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రార్థనలు నిర్వహించకుంటే  ఈపాటికి మన దేశంలో కరోనా వైరస్ చాలా వరకు కట్టడి అయ్యేదేమో. లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా కూడా అడుగులు పడేవేమో. కానీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో వందల మంది కరోనా బారిన పడటం.. వాళ్లు తమ కుటుంబ సభ్యులతో పాటు తమతో సన్నిహితంగా ఉన్న వందల మందికి వైరస్ వ్యాప్తి చేయడంతో గత వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

అంతకుముందు ఏపీ తెలంగాణల్లో రోజూ సింగిల్ డిజిట్లో కరోనా కేసులు బయటపడేవి. కానీ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వాళ్లు కరోనా బారిన పడ్డాక పదుల సంఖ్యలో రోజూ కేసులు బయటికి వస్తున్నాయి. ఐతే కరోనా మీద పెద్దగా అవగాహన లేక, ప్రార్థనలు జరిగిన సమయానికి భయం కొరవడి వీళ్లందరూ వైరస్ బారిన పడ్డారనుకుందాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో తెలిశాక అయినా అప్రమత్తం కావాలి.

కానీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన చాలామంది ఇంటిపట్టునే ఉండిపోతుండటం.. పరీక్షలకు ముందుకు రాకపోవడం.. వైద్య సిబ్బంది వారి కోసం వస్తే దాడులు చేయడం లాంటి పరిణామాలే ఆందోళన కలిగి్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్లో వీరి కోసం వెళ్లిన వైద్య సిబ్బందిని ఎలా తరిమికొట్టారో.. ఎలా దాడులు చేశారో చూశాం. ఇలాంటి ఉదంతాలు మరికొన్ని చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ డీజీపీ సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ప్రభుత్వానికి సహకరించి స్వచ్ఛందంగా పరీక్షల కోసం ఆసుపత్రులకు రాకపోతే వారిపై హత్యాయత్నం కేసు పెడతామన్నారు. అలాగే వీరి కారణంగా ఆయా ప్రాంతాల్లో ఎవరైనా కరోనా సోకి చనిపోతే మర్డర్ కేసు పెడతామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. తక్షణం పరీక్షల కోసం రావాలని.. లేని పక్షంలో తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాల్లో ఇస్తే తప్ప మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన అందరిలో కదలిక రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on April 9, 2020 6:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

43 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

2 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

4 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago