మీ వల్ల కరోనా వచ్చి పోతే మర్డర్ కేసే..

గత నెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రార్థనలు నిర్వహించకుంటే  ఈపాటికి మన దేశంలో కరోనా వైరస్ చాలా వరకు కట్టడి అయ్యేదేమో. లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా కూడా అడుగులు పడేవేమో. కానీ ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో వందల మంది కరోనా బారిన పడటం.. వాళ్లు తమ కుటుంబ సభ్యులతో పాటు తమతో సన్నిహితంగా ఉన్న వందల మందికి వైరస్ వ్యాప్తి చేయడంతో గత వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.

అంతకుముందు ఏపీ తెలంగాణల్లో రోజూ సింగిల్ డిజిట్లో కరోనా కేసులు బయటపడేవి. కానీ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వాళ్లు కరోనా బారిన పడ్డాక పదుల సంఖ్యలో రోజూ కేసులు బయటికి వస్తున్నాయి. ఐతే కరోనా మీద పెద్దగా అవగాహన లేక, ప్రార్థనలు జరిగిన సమయానికి భయం కొరవడి వీళ్లందరూ వైరస్ బారిన పడ్డారనుకుందాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో తెలిశాక అయినా అప్రమత్తం కావాలి.

కానీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన చాలామంది ఇంటిపట్టునే ఉండిపోతుండటం.. పరీక్షలకు ముందుకు రాకపోవడం.. వైద్య సిబ్బంది వారి కోసం వస్తే దాడులు చేయడం లాంటి పరిణామాలే ఆందోళన కలిగి్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్లో వీరి కోసం వెళ్లిన వైద్య సిబ్బందిని ఎలా తరిమికొట్టారో.. ఎలా దాడులు చేశారో చూశాం. ఇలాంటి ఉదంతాలు మరికొన్ని చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ డీజీపీ సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ప్రభుత్వానికి సహకరించి స్వచ్ఛందంగా పరీక్షల కోసం ఆసుపత్రులకు రాకపోతే వారిపై హత్యాయత్నం కేసు పెడతామన్నారు. అలాగే వీరి కారణంగా ఆయా ప్రాంతాల్లో ఎవరైనా కరోనా సోకి చనిపోతే మర్డర్ కేసు పెడతామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. తక్షణం పరీక్షల కోసం రావాలని.. లేని పక్షంలో తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాల్లో ఇస్తే తప్ప మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన అందరిలో కదలిక రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on April 9, 2020 6:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

21 mins ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

2 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

3 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

4 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

4 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

5 hours ago