కండలు తిరిగిన శరీరం.. పోత పోసిన గ్రీకు శిల్పంలా ఉన్న అతడ్ని చూస్తే మగాళ్లు సైతం ఈర్ష పడతారు. ఇక.. అమ్మాయిల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి కండల వీరుడు కాస్తా.. బక్కచిక్కిపోయిన వైనం చూస్తే షాక్ తినాల్సిందే. అతడు.. ఇతడు ఒకరేనా? ఏమైనా తేడా చేస్తున్నారా? పక్కదారి పట్టిస్తున్నారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. రెండు ఫోటోల్లోని వ్యక్తులు ఒకరే. కాకుంటే.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నదే తేడా. కరోనా ఏముంది? లైట్ తీసుకోవచ్చని పొరపడితే అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు.
ఎంతటివాడినైనా కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే కరోనా మాయదారి.. దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. వారి ప్రాణాల మీదకు తీసుకురావటం ఖాయం. అందుకే.. చిన్నపామును సైతం పెద్ద కర్రతో కొట్టాలన్న రూల్ ను కరోనా వేళ అస్సలు మర్చిపోకూడదు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక బాడీ బిల్డర్.. కరోనా బారిన పడి.. మృత్యుముఖం వరకు వెళ్లి వచ్చిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. మల్కాజిగిరికి చెందిన 32 ఏళ్ల సునీల్ కుమార్ గైక్వాడ్ తెలంగాణ రాష్ట్రం తరఫున బాడీ బిల్డింగ్ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాడీ బిల్డింగ్ ప్రదర్శనలో అతగాడిని చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. అలాంటి స్ట్రక్చర్ ఉన్న అతడికి ఏప్రిల్ చివరి వారంలో కరోనా బారిన పడ్డారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేరిన అతడికి ఒకదశలో శ్వాస తీసుకోవటం కష్టంగా మారింది. ఇలాంటి వేళలో అపద్భాందవుడిగా మారిన నటుడు సోనూసూద్ ను సాయం కోరారు. వెంటనే స్పందించిన ఆయన.. సుశీల్ ను నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు.
అప్పటికే బాధితుడి ఊపిరితిత్తులు దాదాపు 80 శాతం ఇన్ ఫెక్షన్ కు గురైనట్లు గుర్తించారు. దీంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న వైద్యులు అతడికి ప్రత్యేక వైద్య సాయాన్ని అందించారు. దీనికి తోడు సుశీల్ పట్టుదల.. కరోనాను జయించాలన్న అతడి సంకల్పం అతడ్నిమరణం నుంచి బయటపడేలా చేసింది. కాకుంటే.. గతంలో వంద కేజీలు ఉండే సుశీల్ ఇప్పుడు 72 కేజీలకు తగ్గిపోయాడు. ఈ ఉదంతాన్నిచూస్తే.. కరోనాకు ఎవరూ అతీతం కాదనే విషయం స్పష్టం కావటమే కాదు.. మహమ్మారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలే తప్పించి నిర్లక్ష్యం అస్సలు వద్దన్న మాటలో నిజమెంతో ఇట్టే అర్థమైపోతుంది.
This post was last modified on June 21, 2021 10:39 am
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…
దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమేనని అందరికీ తెలిసిందే. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…
ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…