ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా మనకు మామిడిపండ్లు రాసులు పోసికనపడతాయి. సమ్మర్ లో కనీసం ఒక్క మామిడి పండు అయినా తినకుండా మ్యాంగో ప్రియులు అస్సలు ఉండలేరు. ఇక కిలో మామిడి పండ్లు ఎంత ధర ఉంటాయి. మహా అయితే రూ.100.. అంతకన్నా ఎక్కువ అంటే రూ.200 ఉంటాయి. లేదంటే ఆర్గానిక్ మామిడి పండ్ల పేరిట మరో రూ.100 ఎక్కవ వసూలు చేయచ్చు.
అయితే.. ఈ మామిడి పండ్లు మాత్రం అలా కాదు. కేవలం రెండు మామిడి పండ్లే.. రూ.రెండున్నర లక్షలు విలువ చేస్తుందంటే నమ్మగలరా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. జపాన్ లో ఈ రకం మామిడి పండ్లు అమ్ముతున్నారు.
ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండ్లను జపాన్ లో అమ్ముతున్నారు. “తైయో నో టామాగో” అనే మామిడి రకం జపాన్లోని మియాజాకి ప్రావిన్స్లో మాత్రమే ఏప్రిల్-ఆగస్ట్ నెలల్లోనే కనిపిస్తాయి. ఈ మామిడి పండ్లు రెండు దాదాపు రూ.2.5 లక్షల వరకు ధర పలుకుతుంటాయి.
అదేంటి మామిడి పండ్లు లక్షల్లోనా..? అని గుడ్లు తేలేస్తున్నారు కదూ! ఈ రకం మామిడి పండ్లను ప్రత్యేక ఆర్డర్ తీసుకున్న తర్వాతే పండిస్తారు. ఈ పండ్లు సగం ఎరుపు, సగం పసుపు రంగులో ఉంటాయి. జపాన్లో వేసవి-శీతాకాలాల మధ్య సీజన్లో పండిస్తారు. వీటిని ప్రత్యేక పద్ధతిలో పండిస్తున్నందు వలన చాలా ఖర్చు అవుతుందంట. అందుకే రేటు కూడా అదిరిపోతుంది.
“తైయో నో టామాగోష అంటే జపాన్ భాషలో సూర్యుడి కోడిగుడ్డు. ఈ మామిడిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. అలసిపోయిన కళ్ళ సహాయకారిణిగా ఉంటుంది. దృష్టి సమస్యలు రాకుండా ఈ మామిడి పండ్లు కాపాడతాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే ముందు వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారని, అత్యధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన వాటినే ఎగుమతి చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తుంది.
కాయ కాయగానే వాటిని మెష్ వస్త్రంతో కట్టివేసి పెంచుతారు. ఒక్కో మామిడి పండు బరువు దాదాపు 350 గ్రాముల వరకు ఉంటుంది. అంటే రెండు పండ్లు 700 గ్రాములకు రూ.2.5 లక్షల ధర పలుకుతుంది. కిలో కావాలంటే రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రేటు విని అందరూ నోరెళ్లపెడుతున్నారు.
This post was last modified on June 18, 2021 11:16 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…