శభాష్.. హైదరబాద్ ను బాగా చూసుకుంటున్నారు

హైదరబాద్ మహానగర పురపాలక సంస్థ (GHMC) పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు వేసిన రెండు రోజులకే వాటర్ బోర్డు వాళ్లు గానీ లేదా కేబుల్ కోసమో లేదా ఇంకేదో విషయం కోసమో వెంటనే తవ్వేస్తుంటారు. జీహెచ్ఎంసీలోని శాఖల మధ్య సమన్వయం ఏ మాత్రం లేదని చాలాసార్లు నిరూపించుకున్నారు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అద్భుతంగా స్పందిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా నగరంలో ఉన్న కోటిన్నరకు పైగా వాహనాలు ఇళ్లకే పరిమితం అయిపోయాయి. జనాలు కూడా లేక రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఈ సమయాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్న జీహెచ్ఎంసీ నగరంలోని రోడ్ల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టింది. భాగ్యనగరంలోని నలుమూలలను 709 కి.మీ.ల రోడ్ల మెయింటనెన్స్‌ను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అలాగే  వైరస్‌ వ్యాపించకుండా నిరోధించేందుకు అవసరమైన క్రిమిసంహారక మందులను రోడ్లపై పిచికారి చేస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లను, కరోనా పాజిటివ్‌గా తేలిన రోగుల ఏరియాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి శుభ్రం చేస్తున్నారు. అలాగే నగరంలోని రోడ్లపై ఉన్న అభాగ్యుల కోసం ఆహారం కూడా సరఫరా చేస్తోంది జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. గుంపులుగా జనం చేరకుండా మనిషికి మనిషికి మధ్య దూరం ఉండేలా చూసుకుంటూ వారి ఆకలి తీరుస్తోంది. అలాగే దాతల నుంచి ఆహారాన్ని, నిత్యావసరాలను సేకరించి అవసరమైనవారికి చేరవేస్తున్నారు. ఆపద సమయంలో అద్భుతంగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీకి నగర ప్రజల నుంచి అభినందనలు వస్తున్నాయి.

This post was last modified on April 9, 2020 6:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago