క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చోటు చేసుకోని ఉన్మాద చర్య ఒకటి చోటు చేసుకుంది. తాను అడిగినంతనే ఔట్ ఇవ్వలేదన్న కోపంతో స్టార్ ఆటగాడు చేసిన చేష్టతో అవాక్కు అవుతున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు మరే క్రికెటర్ వ్యవహరించని తీరును గ్రౌండ్ లో ప్రదర్శించిన తీరును తిట్టిపోస్తున్నారు. ఎంత ఔట్ ఇవ్వకపోతే మాత్రం ఇలా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఆటగాడంటే.. బంగ్లాదేశ్ స్టార్ అలౌండర్ షకీబ్ అల్ హసన్. ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ కు అబహాని లిమిటెడ్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. షకిబ్ అల్ హసన్ మహ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బౌల్ వేసినంతనే.. అవుట్ అని అప్పీల్ చేయటం.. అందుకు అంపైర్ నో చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతగాడు.. కాలితో ఎగిరి వికెట్లను బలంగా తన్నటంతో మిడిల్ వికెట్ పక్కకు పడిపోయింది. అంతేకాదు.. అంపైర్ పై దూసుకెళ్లాడు. ఇదే టోర్నీలో ఫీల్డ్ చేస్తున్న సమయంలోనూ అంపైర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతూ.. అతనిపైకి వెళ్లాడు.
ఇతగాడి తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతడి వ్యవహారశైలి కచ్ఛితంగా ఐసీసీ ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ క్లబ్ సైతం ఇతడిపై ఎలాంటి చర్య తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా జంటిల్ మ్యాన్ గేమ్ గా అభివర్ణించే క్రికెట్ ఇప్పటికే గౌరవ మర్యాదలు తగ్గాయన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. షకిబ్ తీరు మాత్రం సిగ్గుతో తలదించుకునేలా ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on June 12, 2021 11:03 am
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…