ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ రెండు సంస్థలకు రష్యా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నిషేదిత కంటెంట్ ని తొలగించడంలో.. విఫలమైన కారణంగా వీటికి జరిమానా విధించడం గమనార్హం.
ఫేస్ బుకి 17మిలియన్ రబెల్స్( 2.36లక్షల డాలర్లు), టెలిగ్రామ్ 10 మిలియన్ రబెల్స్(1.39లక్షల డాలర్లు) చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సోషల్ మీడియా సంస్థలకు జరిమానా విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించని నేపథ్యంలో.. గత నెల కూడా ఈ రెండు సంస్థలకు భారీగానే ఫైన్ పడింది. గత నెల ఫేస్ బుక్ కి 26 మిలియన్స్ రబెల్స్, టెలిగ్రామ్ కి 5 మిలియన్ రబెల్స్ ఫైన్ విధించారు.
కాగా.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆందోళనకారులు వీదుల్లో నిరననలు చేపట్టారు. అయితే.. దీనికి సోషల్ మీడియా సంస్థలే కారణమంటూ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ సోషల్ మీడియా వెబ్ సైట్లపై నియంత్రణ పెంచాలని భావించిన రష్యా ప్రభుత్వం.. ట్విట్టర్ పై నిషేధం విధించాలని కూడా భావించింది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చట్టవిరుద్ధంగా ఉన్న కంటెంట్ తొలగించలేదని ఫేస్ బుక్, టెలిగ్రామ్ లకు జరిమానాలు విధించింది.
This post was last modified on June 11, 2021 4:17 pm
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…