ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ రెండు సంస్థలకు రష్యా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నిషేదిత కంటెంట్ ని తొలగించడంలో.. విఫలమైన కారణంగా వీటికి జరిమానా విధించడం గమనార్హం.
ఫేస్ బుకి 17మిలియన్ రబెల్స్( 2.36లక్షల డాలర్లు), టెలిగ్రామ్ 10 మిలియన్ రబెల్స్(1.39లక్షల డాలర్లు) చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సోషల్ మీడియా సంస్థలకు జరిమానా విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించని నేపథ్యంలో.. గత నెల కూడా ఈ రెండు సంస్థలకు భారీగానే ఫైన్ పడింది. గత నెల ఫేస్ బుక్ కి 26 మిలియన్స్ రబెల్స్, టెలిగ్రామ్ కి 5 మిలియన్ రబెల్స్ ఫైన్ విధించారు.
కాగా.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆందోళనకారులు వీదుల్లో నిరననలు చేపట్టారు. అయితే.. దీనికి సోషల్ మీడియా సంస్థలే కారణమంటూ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ సోషల్ మీడియా వెబ్ సైట్లపై నియంత్రణ పెంచాలని భావించిన రష్యా ప్రభుత్వం.. ట్విట్టర్ పై నిషేధం విధించాలని కూడా భావించింది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చట్టవిరుద్ధంగా ఉన్న కంటెంట్ తొలగించలేదని ఫేస్ బుక్, టెలిగ్రామ్ లకు జరిమానాలు విధించింది.
This post was last modified on June 11, 2021 4:17 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…