ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ రెండు సంస్థలకు రష్యా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నిషేదిత కంటెంట్ ని తొలగించడంలో.. విఫలమైన కారణంగా వీటికి జరిమానా విధించడం గమనార్హం.
ఫేస్ బుకి 17మిలియన్ రబెల్స్( 2.36లక్షల డాలర్లు), టెలిగ్రామ్ 10 మిలియన్ రబెల్స్(1.39లక్షల డాలర్లు) చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సోషల్ మీడియా సంస్థలకు జరిమానా విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించని నేపథ్యంలో.. గత నెల కూడా ఈ రెండు సంస్థలకు భారీగానే ఫైన్ పడింది. గత నెల ఫేస్ బుక్ కి 26 మిలియన్స్ రబెల్స్, టెలిగ్రామ్ కి 5 మిలియన్ రబెల్స్ ఫైన్ విధించారు.
కాగా.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆందోళనకారులు వీదుల్లో నిరననలు చేపట్టారు. అయితే.. దీనికి సోషల్ మీడియా సంస్థలే కారణమంటూ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ సోషల్ మీడియా వెబ్ సైట్లపై నియంత్రణ పెంచాలని భావించిన రష్యా ప్రభుత్వం.. ట్విట్టర్ పై నిషేధం విధించాలని కూడా భావించింది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చట్టవిరుద్ధంగా ఉన్న కంటెంట్ తొలగించలేదని ఫేస్ బుక్, టెలిగ్రామ్ లకు జరిమానాలు విధించింది.
This post was last modified on June 11, 2021 4:17 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…