ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ రెండు సంస్థలకు రష్యా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. నిషేదిత కంటెంట్ ని తొలగించడంలో.. విఫలమైన కారణంగా వీటికి జరిమానా విధించడం గమనార్హం.
ఫేస్ బుకి 17మిలియన్ రబెల్స్( 2.36లక్షల డాలర్లు), టెలిగ్రామ్ 10 మిలియన్ రబెల్స్(1.39లక్షల డాలర్లు) చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సోషల్ మీడియా సంస్థలకు జరిమానా విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించని నేపథ్యంలో.. గత నెల కూడా ఈ రెండు సంస్థలకు భారీగానే ఫైన్ పడింది. గత నెల ఫేస్ బుక్ కి 26 మిలియన్స్ రబెల్స్, టెలిగ్రామ్ కి 5 మిలియన్ రబెల్స్ ఫైన్ విధించారు.
కాగా.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్ని అరెస్టు చేశారు. ఆ సమయంలో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆందోళనకారులు వీదుల్లో నిరననలు చేపట్టారు. అయితే.. దీనికి సోషల్ మీడియా సంస్థలే కారణమంటూ అధికారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. ఈ సోషల్ మీడియా వెబ్ సైట్లపై నియంత్రణ పెంచాలని భావించిన రష్యా ప్రభుత్వం.. ట్విట్టర్ పై నిషేధం విధించాలని కూడా భావించింది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చట్టవిరుద్ధంగా ఉన్న కంటెంట్ తొలగించలేదని ఫేస్ బుక్, టెలిగ్రామ్ లకు జరిమానాలు విధించింది.
This post was last modified on June 11, 2021 4:17 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…