హైదరాబాద్ పాతబస్తీలో తాజాగా చోటు చేసుకున్న ఒక హత్య షాకింగ్ గా మారింది.ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్న వాడిని.. కిరాతకంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. సీపీ కెమేరా ఫుటేజ్ తో నిందితుడ్ని గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోవటం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకూ జరిగిందేమంటే?
పాతబస్తీకి చెందిన అన్వర్ కు ఒక కుమార్తె ఉంది. ఆమెను ప్రేమ పేరుతో షారుఫ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. దీంతో.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతన్ని అరెస్టు చేశారు. పోస్కోకేసు బుక్ చేశారు. అయినప్పటికి తన పద్దతని మార్చుకోని షారుఫ్.. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడు. తానెంత చెప్పినా వినకుండా.. రివర్సులో వార్నింగ్ లు ఇస్తున్న షారుఫ్ ను చంపేయాలన్న ప్లాన్ వేశాడు అన్వర్.
అందులో భాగంగా కాస్త మాట్లాడాలంటూ షారుఫ్ కు కబురు పంపాడు. నమ్మి వచ్చిన అతనితో.. కాస్త పని ఉంది.. శాలిబండ వరకు వెళ్లేందుకు సాయంగా వస్తావా? అని అడిగాడు. అతని మాటల్ని నమ్మి.. తన బైక్ మీద వెనుక కూర్చోబెట్టుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రారం ఫలక్ నుమా బస్ డిపో వద్దకు రాగానే.. తన ముందున్న ఫారుఫ్ గొంతు కోసేశాడు. బైక్ నడుపుతున్న ఫారుఫ్ కు విషయం అర్థమై..గొంతును బలంగా పట్టుకొని రోడ్డు మీద పరుగులు తీశాడు. కాస్త దూరం పరుగెత్తి..కుప్పకూలిపోయాడు. సీసీ కెమేరాను పరిశీలించిన పోలీసులకు.. బైక్ వెనుక కూర్చొని ఉన్న అన్వరే గొంతు కోసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…