కన్నడిగులకు మరో అవమానం ఎదురైంది. కొద్దిరోజుల క్రితం భారత్లో అత్యంత వికారమైన భాష ఏది? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. కన్నడ అనే సమాధానం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ విషయంలో కన్నడిగులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో.. వారికి ఇతర భాషల వాళ్లు కూడా వారికి మద్దతుగా నిలబడటం తెలిసిందే. ఆ ఉదంతంపై గూగుల్కు లీగల్ నోటీసు కూడా జారీ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం దిగి వచ్చి.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పింది. ఈ వివాదాన్ని మరచిపోకముందే కన్నడిగలకు మరో అవమానం జరిగింది…
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. కెనడాలో అమ్ముతోన్న బికినీలపై కర్ణాటక రాష్ట్ర జెండాతో ముద్రించడం వివాదాస్పదమైంది. పసుపు-ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన లోదుస్తుల్ని అమెజాన్ వెబ్సైట్, యాప్లో విక్రయిస్తున్నారు. సదరు ప్రాడక్ట్ ను కన్నడ జెండా బికినీగానే అమెజాన్ పేర్కొనడం గమనార్హం.
ఈ వ్యవహారంపై కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబాలి తప్పుపట్టారు. మొన్న గూగుల్, ఇవాళ అమెజాన్.. ఇంకా ఎంత కాలం తమ భాష, సంస్కృతి, జెండాను అవమానిస్తారంటూ ఫైరయ్యారు. అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసినందుకు అమెజాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.
కాగా, నిజానికి కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా అంటూ ఏదీ లేదు, అయితే, కన్నడ సాంస్కృతిక చిహ్నంగా రూపొందిన జెండాను కన్నడిగులు, ఆ భాష, సాంస్కృతిక ప్రేమికులు వాడుతుంటారు. దానికి గుర్తింపు కల్పించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినా, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
This post was last modified on June 7, 2021 9:04 am
కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…
నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్…
పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…