కన్నడిగులకు మరో అవమానం ఎదురైంది. కొద్దిరోజుల క్రితం భారత్లో అత్యంత వికారమైన భాష ఏది? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. కన్నడ అనే సమాధానం వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ విషయంలో కన్నడిగులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో.. వారికి ఇతర భాషల వాళ్లు కూడా వారికి మద్దతుగా నిలబడటం తెలిసిందే. ఆ ఉదంతంపై గూగుల్కు లీగల్ నోటీసు కూడా జారీ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం దిగి వచ్చి.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పింది. ఈ వివాదాన్ని మరచిపోకముందే కన్నడిగలకు మరో అవమానం జరిగింది…
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. కెనడాలో అమ్ముతోన్న బికినీలపై కర్ణాటక రాష్ట్ర జెండాతో ముద్రించడం వివాదాస్పదమైంది. పసుపు-ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన లోదుస్తుల్ని అమెజాన్ వెబ్సైట్, యాప్లో విక్రయిస్తున్నారు. సదరు ప్రాడక్ట్ ను కన్నడ జెండా బికినీగానే అమెజాన్ పేర్కొనడం గమనార్హం.
ఈ వ్యవహారంపై కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబాలి తప్పుపట్టారు. మొన్న గూగుల్, ఇవాళ అమెజాన్.. ఇంకా ఎంత కాలం తమ భాష, సంస్కృతి, జెండాను అవమానిస్తారంటూ ఫైరయ్యారు. అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసినందుకు అమెజాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.
కాగా, నిజానికి కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా అంటూ ఏదీ లేదు, అయితే, కన్నడ సాంస్కృతిక చిహ్నంగా రూపొందిన జెండాను కన్నడిగులు, ఆ భాష, సాంస్కృతిక ప్రేమికులు వాడుతుంటారు. దానికి గుర్తింపు కల్పించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినా, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
This post was last modified on June 7, 2021 9:04 am
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన…
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…