ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అస్సలు బాలేదు. కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు పెడితే.. విద్యార్థులు ఆ మహమ్మారి బారినపడే ప్రమాదం ఉందని.. ఏకంగా పరీక్షలు కూడా రద్దు చేశారు. గతేడాది సైతం పరీక్షలు నిర్వహించలేదు. ఇక క్లాసులు సైతం ఆన్ లైన్ లోనే నిర్వహించారు. తాజాగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ.. ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్త విని చాలా మంది విద్యార్థులు ఎగిరి గంతేసి ఉంటారు. పరీక్ష రాయకుండా పాస్ అవ్వడం అంటే చాలా మందికి నచ్చే విషయమే. అయితే.. ఓ విద్యార్థికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఆ విద్యార్థికి నచ్చనది.. పరీక్షలు రద్దు చేయడం కాదు.. దీని కారణంగా తాము ఫేర్ వెల్ పార్టీ చేసుకోలేకపోతున్నామని.
మామూలుగా.. కాలేజీ వదిలి వెళ్లే విద్యార్థులకు జూనియర్లు.. ఫేర్ వేల్ పార్టీ ఇవ్వడం చాలా కామన్. ఈ కరోనా సమయంలో కాలేజీలే లేవు.. ఇక పార్టీలు ఎక్కడ ఉంటాయి. అందుకే.. ఓ స్టూడెంట్ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.
తమకు ఫేర్వెల్ పార్టీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని.. అది కూడా.. స్నేహితులకు దూరమౌతున్నందుకు అనుకుంటే పొరపాటే. తన క్లాస్ మెట్ ఓ అమ్మాయిని చీరలో చూడాలని ఈ అబ్బాయికి కోరికట. ఈ పార్టీలో దాదాపు విద్యార్థులు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు. కదా.. అందుకోసం.. ఆ అమ్మాయిని చీరలో చూడాలనే తన కోరిక తీర్చుకోవడం కోసం.. ఫేర్వేల్ పార్టీ చేసుకోనివ్వండి ప్లీజ్ అంటూ.. ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం గమనార్హం.
ఈ విద్యార్థి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అతని కోరిక విని నెటిజన్లు నవ్వుకుంటారు. ఇక ఈ ట్వీట్ పై మీమ్స్ అయితే.. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…