Trends

ఆమెను శారీలో చూడాలనుంది.. మోదీకి స్టూడెంట్ రిక్వెస్ట్

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అస్సలు బాలేదు. కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు పెడితే.. విద్యార్థులు ఆ మహమ్మారి బారినపడే ప్రమాదం ఉందని.. ఏకంగా పరీక్షలు కూడా రద్దు చేశారు. గతేడాది సైతం పరీక్షలు నిర్వహించలేదు. ఇక క్లాసులు సైతం ఆన్ లైన్ లోనే నిర్వహించారు. తాజాగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ.. ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వార్త విని చాలా మంది విద్యార్థులు ఎగిరి గంతేసి ఉంటారు. పరీక్ష రాయకుండా పాస్ అవ్వడం అంటే చాలా మందికి నచ్చే విషయమే. అయితే.. ఓ విద్యార్థికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఆ విద్యార్థికి నచ్చనది.. పరీక్షలు రద్దు చేయడం కాదు.. దీని కారణంగా తాము ఫేర్ వెల్ పార్టీ చేసుకోలేకపోతున్నామని.

మామూలుగా.. కాలేజీ వదిలి వెళ్లే విద్యార్థులకు జూనియర్లు.. ఫేర్ వేల్ పార్టీ ఇవ్వడం చాలా కామన్. ఈ కరోనా సమయంలో కాలేజీలే లేవు.. ఇక పార్టీలు ఎక్కడ ఉంటాయి. అందుకే.. ఓ స్టూడెంట్ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.

తమకు ఫేర్వెల్ పార్టీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని.. అది కూడా.. స్నేహితులకు దూరమౌతున్నందుకు అనుకుంటే పొరపాటే. తన క్లాస్ మెట్ ఓ అమ్మాయిని చీరలో చూడాలని ఈ అబ్బాయికి కోరికట. ఈ పార్టీలో దాదాపు విద్యార్థులు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు. కదా.. అందుకోసం.. ఆ అమ్మాయిని చీరలో చూడాలనే తన కోరిక తీర్చుకోవడం కోసం.. ఫేర్వేల్ పార్టీ చేసుకోనివ్వండి ప్లీజ్ అంటూ.. ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం గమనార్హం.

ఈ విద్యార్థి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అతని కోరిక విని నెటిజన్లు నవ్వుకుంటారు. ఇక ఈ ట్వీట్ పై మీమ్స్ అయితే.. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.

This post was last modified on June 3, 2021 10:29 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

3 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

4 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

8 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

11 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

11 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

13 hours ago