Trends

ఆమెను శారీలో చూడాలనుంది.. మోదీకి స్టూడెంట్ రిక్వెస్ట్

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అస్సలు బాలేదు. కరోనా భయంకరంగా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు పెడితే.. విద్యార్థులు ఆ మహమ్మారి బారినపడే ప్రమాదం ఉందని.. ఏకంగా పరీక్షలు కూడా రద్దు చేశారు. గతేడాది సైతం పరీక్షలు నిర్వహించలేదు. ఇక క్లాసులు సైతం ఆన్ లైన్ లోనే నిర్వహించారు. తాజాగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ.. ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వార్త విని చాలా మంది విద్యార్థులు ఎగిరి గంతేసి ఉంటారు. పరీక్ష రాయకుండా పాస్ అవ్వడం అంటే చాలా మందికి నచ్చే విషయమే. అయితే.. ఓ విద్యార్థికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఆ విద్యార్థికి నచ్చనది.. పరీక్షలు రద్దు చేయడం కాదు.. దీని కారణంగా తాము ఫేర్ వెల్ పార్టీ చేసుకోలేకపోతున్నామని.

మామూలుగా.. కాలేజీ వదిలి వెళ్లే విద్యార్థులకు జూనియర్లు.. ఫేర్ వేల్ పార్టీ ఇవ్వడం చాలా కామన్. ఈ కరోనా సమయంలో కాలేజీలే లేవు.. ఇక పార్టీలు ఎక్కడ ఉంటాయి. అందుకే.. ఓ స్టూడెంట్ ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.

తమకు ఫేర్వెల్ పార్టీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని.. అది కూడా.. స్నేహితులకు దూరమౌతున్నందుకు అనుకుంటే పొరపాటే. తన క్లాస్ మెట్ ఓ అమ్మాయిని చీరలో చూడాలని ఈ అబ్బాయికి కోరికట. ఈ పార్టీలో దాదాపు విద్యార్థులు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు. కదా.. అందుకోసం.. ఆ అమ్మాయిని చీరలో చూడాలనే తన కోరిక తీర్చుకోవడం కోసం.. ఫేర్వేల్ పార్టీ చేసుకోనివ్వండి ప్లీజ్ అంటూ.. ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం గమనార్హం.

ఈ విద్యార్థి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అతని కోరిక విని నెటిజన్లు నవ్వుకుంటారు. ఇక ఈ ట్వీట్ పై మీమ్స్ అయితే.. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.

This post was last modified on June 3, 2021 10:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

35 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

2 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

4 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago