సైకిల్ జ్యోతి.. గతేడాది ఈ పేరు దేశమంతటా మారుమోగింది. ఈ పేరు వినగానే ఆమె కథ అందతా మీకు గుర్తుకువచ్చే ఉంటుంది. గతేడాది కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న క్రమంలో లాక్ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని సైకిల్పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించి తమ ఇంటికి తీసుకువచ్చింది. తండ్రి ప్రాణాలు కాపాడటానికి ఆమె చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఏడు రోజుల్లో ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడ విశేషం. దీనిని కొందరు వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారాయి.
ఆమె తండ్రి కోసం పడిన తపన.. అమెరికా మాజీ దేశాధ్యక్షుని కూతురు ఇవాంక ట్రంప్ ని కూడా ఆకట్టుకుంది. ఆమె ట్వీట్ తో ఈ సైకిల్ జ్యోతి ప్రపంచానికి కూడా చేరువైంది. కాగా.. ఇప్పుడు ఆ జ్యోతి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఏ తండ్రి కోసమైతే.. ఆమె గతేడాది అంత సాహసం చేసిందో.. సరిగ్గా ఏడాది తిరిగిలోపు ఆమె ఆ తండ్రి దూరమయ్యాడు. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించారు. ఈ వార్త అందరినీ కలచివేస్తోంది.
మోహన్ పాశ్వాన్ గురుగ్రామ్లో ఈ-రిక్షా నడిపేవారు. దేశవ్యాప్త కరోనా లాక్డౌన్ వల్ల రిక్షా యజమాని దానిని తీసుకున్నాడు. దీంతో ఆయనకు ఉపాధిలేకుండా పోయింది. పాశ్వాన్ కాలికి గాయం కావడంతో ఆయన బాగోగులు చూడటానికి 16 ఏండ్ల జోత్యి గురుగ్రామ్కు వెళ్లింది. అదే సమయంలో లాక్డౌన్ రావడం.. చేసేందుకు పనుల్లేక జీవనం కష్టంగా మారింది. దీనికితోడు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడం, తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో.. జ్యోతి ధైర్యం చేసి తండ్రిని సైకిల్ పై స్వగ్రామానికి తీసుకువచ్చింది.
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…