Trends

‘సైకిల్ జ్యోతి’ తండ్రి మృతి

సైకిల్ జ్యోతి.. గతేడాది ఈ పేరు దేశమంతటా మారుమోగింది. ఈ పేరు వినగానే ఆమె కథ అందతా మీకు గుర్తుకువచ్చే ఉంటుంది. గతేడాది కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న క్రమంలో లాక్ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్ర‌యాణించి త‌మ ఇంటికి తీసుకువ‌చ్చింది. తండ్రి ప్రాణాలు కాపాడటానికి ఆమె చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఏడు రోజుల్లో ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవడ విశేషం. దీనిని కొందరు వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారాయి.

ఆమె తండ్రి కోసం పడిన తపన.. అమెరికా మాజీ దేశాధ్యక్షుని కూతురు ఇవాంక ట్రంప్ ని కూడా ఆకట్టుకుంది. ఆమె ట్వీట్ తో ఈ సైకిల్ జ్యోతి ప్రపంచానికి కూడా చేరువైంది. కాగా.. ఇప్పుడు ఆ జ్యోతి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఏ తండ్రి కోసమైతే.. ఆమె గతేడాది అంత సాహసం చేసిందో.. సరిగ్గా ఏడాది తిరిగిలోపు ఆమె ఆ తండ్రి దూరమయ్యాడు. జ్యోతి తండ్రి మోహన్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించారు. ఈ వార్త అందరినీ కలచివేస్తోంది.

మోహ‌న్ పాశ్వాన్ గురుగ్రామ్‌లో ఈ-రిక్షా న‌డిపేవారు. దేశ‌వ్యాప్త‌ క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల రిక్షా య‌జ‌మాని దానిని తీసుకున్నాడు. దీంతో ఆయ‌నకు ఉపాధిలేకుండా పోయింది. పాశ్వాన్‌ కాలికి గాయం కావ‌డంతో ఆయ‌న బాగోగులు చూడ‌టానికి 16 ఏండ్ల జోత్యి గురుగ్రామ్‌కు వెళ్లింది. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ రావ‌డం.. చేసేందుకు ప‌నుల్లేక‌ జీవ‌నం క‌ష్టంగా మారింది. దీనికితోడు ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డ నిలిచిపోవ‌డం, తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో.. జ్యోతి ధైర్యం చేసి తండ్రిని సైకిల్ పై స్వగ్రామానికి తీసుకువచ్చింది.

This post was last modified on June 1, 2021 12:55 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

53 mins ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

1 hour ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

2 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

2 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

2 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

2 hours ago