తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు. చేసిన తప్పు నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. తాజాగా ఆ విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఒక పెద్ద కంపెనీలో టీం లీడర్ గా పని చేసే మహిళ విలాసాల మోజులో ఎంత దారుణానికి దిగిందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. పోలీస్ కానిస్టేబుల్ ను జైలుకు పంపిన ఆమె.. తాజాగా చేసిన పాపం పండి తనూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది.
షాకింగ్ గా ఉండే ఈ ఉదంతంలోకి వెళితే.. హైదరాబాద్ లోని నాగోలుకు సమీపంలోని బండ్లగూడకు చెందిన 33 ఏళ్ల బ్లెస్సీ అలియాస్ అల్లూరు నేహా ఒక కంపెనీలో టీం లీడరుగా పని చేసేవారు.
ఖరీదైన జీవితం ఆమెకు అలవాటైంది. విలాసాల మోజులో కూరుకుపోయింది. కరోనా కారణంగా ఆమె జాబ్ పోయింది. ఒక జిమ్ లో ఏఆర్ కానిస్టేబుల్ తో పరిచయమైంది. కట్ చేస్తే.. అతడికి పెళ్లైందన్న విషయాన్ని దాచి పెట్టి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ తో అతన్ని జైలుకు పంపారు.
ఇదిలా ఉంటే.. సదరు కానిస్టేబుల్ భార్యతో పాటు.. ఇతర కుటుంబ సభ్యులకు చెందిన నకిలీ ప్రొఫైల్స్ తో ఇన్ స్ట్రా.. ఫేస్ బుక్ ఖాతాల్ని క్రియేట్ చేసింది. అభ్యంతరకర సందేశాలు.. అసభ్య మెసేజ్ లు పంపటం షురూ చేసింది. ఈ టార్చర్ భరించలేని కానిస్టేబుల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఈ మొత్తం వ్యవహారానికి కారణం.. బ్లెస్సీగా తేల్చారు. తాజాగా ఆమెను అరెస్టు చేశారు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…