Trends

డేంజన్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత నుండి డేంజర్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి ఓ రాష్ట్రం చేరుకున్నదంటే మామూలు విషయం కాదు. డేంజర్ జోన్లోకి వెళ్ళినందుకు ప్రభుత్వ యంత్రంగాన్ని, జనాలను ఇద్దరినీ తప్పు పట్టాల్సిందే. ఇదే సమయంలో సేఫ్ జోన్లోకి చేరుకున్నదంటే కూడా ప్రభుత్వం+జనాలను అభినందించాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయిన ఢిల్లీ మళ్ళీ సేఫ్ జోన్లోకి చేరుకోవటమే.

ఢిల్లీలో ఏప్రిల్ నెలకు ముందు రోజుకు 30 వేల కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీలో సమస్య ఏమిటంటే కొన్ని విభాగాలు రాష్ట్రప్రభుత్వం చేతిలో ఉంటాయి. మరికొన్ని శాఖలు కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. వైద్యారోగ్య శాఖ ఏమో కేజ్రీవాల్ చేతిలో ఉంటే పోలీసు శాఖేమో నరేంద్రమోడి ఆధీనంలో పనిచేస్తుంది.

ఇపుడు కరోనా వైరస్ సమస్య అదుపులోకి రావటానికి కేంద్రమైనా, రాష్ట్రప్రభుత్వాలైనా లాక్ డౌన్ అని కర్ఫ్యూ అని నిబంధనలు విధిస్తున్నాయి. అయితే ఢిల్లీలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల మధ్య సఖ్యత లేని కారణంగా కేజ్రీవాల్ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏమి అమలు చేయాలన్నా సాధ్యంకాదు. దాంతో కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి. దాంతో వేరేదారి లేక కేంద్రంతో మాట్లాడి సంపూర్ణ లాక్ డౌన్ విధించేశారు. లాక్ డౌన్ విధించటంతోనే మంచి ఫలితాలు వచ్చాయని చెప్పచ్చు.

గడచిన 24 గంటల్లో ఢిల్లీలో నమోదైన కేసులు 3 వేలు మాత్రమే. అలాగే 252 మంది చనిపోయారు. ఇదే ఒకపుడు కేసులు, మరణాలు కూడా వేలల్లో నమోదయ్యేవి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాల ప్రకారం పాజిటివిటి రేటు 10 శాతం దాటితే డేంజర్ జోన్లోకి ప్రవేశించినట్లే. అలాగే 5 శాతంలో ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్లే. అంటే ఢిల్లీ చాలా స్పీడుగా డేంజర్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ అంతే స్పీడుగా సేఫ్ జోన్లోకి వచ్చేసిందనే చెప్పాలి. మరి ఇదే సేఫ్ జోన్ కంటిన్యు అవ్వాలంటే జనాలు సహకరిస్తే మాత్రమే సాధ్యమవుతుంది.

This post was last modified on May 22, 2021 10:55 am

Share
Show comments
Published by
satya

Recent Posts

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

2 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

2 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

3 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

5 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

5 hours ago

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

7 hours ago