Trends

కరోనా పురుషుల్లోనే ఎక్కువ.. ఎందుకు?

కరోనా వైరస్ వ్యాప్తి మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. పది మందిలో ఎనిమిది మంది కరోనా పేషెంట్లు మగవాళ్లే. పురుషులు బయట ఎక్కువగా తిరగడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి వారిలో ఎక్కువగా ఉన్నట్లు భావించారు. ఐతే కరోనా పేషెంట్లయిన మగవాళ్లు ఉన్న ఇళ్లలోనూ మహిళలకు వైరస్ అంతగా సోకట్లేదని తెలుస్తుండటంతో దీని వెనుక మతలబు ఏంటో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు.

ఐతే తాజాగా వెలువడిన ఓ అధ్యయనం దీని వెనుక కారణాలేంటో వెల్లడించింది. కోవిడ్-19 కారకమైన ‘సార్స్-కోవ్ 2’ వైరస్ యాంజియో టెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్-2 అనే ఎంజైమ్ ద్వారా కణాల్లోకి ప్రవేశిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్య సంస్థ కనుగొంది. ఇది కణాల ఉపరితలంపై ఉండి కరోనా వైరస్ లోనికి ప్రవేశించేందుకు తోడ్పడుతున్నట్లు తేల్చారు.

ఈ ఎంజైమ్ పురుషుల్లో అధికంగా ఉంటుందని.. అందుకే వాళ్లు తేలిగ్గా వైరస్ బారిన పడుతున్నారని వెల్లడైంది. మహిళల్లో ఈ ఎంజైమ్ తక్కువగా ఉండటం వల్ల వారికి వైరస్ ముప్పు తక్కువగా ఉంటోందని తేలింది.

ఈ ఎంజైమ్ గురించి కరోనా వైరస్ రావడానికి ముందే తాము అధ్యయనం జరిపామని.. హృద్రోగ సమస్యల్ని అధ్యయనం చేస్తుండగా పురుషుల్లో ఈ ఎంజైమ్ అధికంగా ఉన్నట్లు గుర్తించామని.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న దశలో ఈ ఎంజైమ్ గురించి మరింతగా పరిశోధిస్తే కరోనా వ్యాప్తికి అది దోహదపడుతున్నట్లు తేలిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, మూత్ర పిండాల సంబంధిత వ్యాధులను నియంత్రించడానికి వాడే యాంజియో టెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్‌ను కరోనా వైరస్ రోగులకు ఇవ్వడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చని కూడా ఈ అధ్యయనంలో తేలింది.

This post was last modified on May 11, 2020 3:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago