ఇటీవల ‘బాయ్స్ లాకర్ రూం’ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్క్రీన్ షాట్లు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. అమ్మాయిని రేప్ చేయడం గురించి స్కూల్ విద్యార్థులు జరిపిన చాట్లు చూసి నెటిజన్లు షాకైపోయారు. అంత చిన్న వయసులో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడం గురించి దారుణంగా మాట్లాడుకోవడం ఆందోళన కలిగించింది.
ఈ తరం కుర్రాళ్లు చిన్న వయసులోనే ఎలా చెడిపోతున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం అంటూ ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల్ని విమర్శించిన వాళ్లూ లేకపోలేదు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై దృష్టిసారించిన పోలీసులు.. విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చాట్ వెనుక ఉన్నది ఓ అమ్మాయి అని వెల్లడైంది.
అబ్బాయిల క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడం కోసం ఓ అమ్మాయి.. ‘సిద్దార్థ్’ అనే అబ్బాయి పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిని రేప్ చేసే టాపిక్ మీద చర్చ మొదలుపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చాట్ సెషన్లో పాల్గొన్న ఓ అబ్బాయి.. ఈ టాపిక్ మీద మాట్లాడేందుకు నిరాకరించినా, బలవంతంగా అతణ్ని ఇందులోకి ఆ అమ్మాయి లాగినట్లు విచారణలో తేలింది.
అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసే ప్రతిపాదన గురించి చాట్ సెషన్లో ఈ అమ్మాయే ప్రతిపాదన చేసి.. దాని గురించి అవతలి కుర్రాళ్లు చర్చించేలా చేసిందని.. ఈ చర్చకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఒక అబ్బాయి తన స్నేహితులతో పంచుకోగా.. ఒక కుర్రాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని.. దీంతో అది వైరల్ అయి పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై రెచ్చిపోయి మాట్లాడిన ఫెమినిస్టులంతా ఇప్పుడు ఏమంటారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘బాయ్స్ లాకర్ రూం ట్రూత్’ పేరుతో హ్యష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on May 11, 2020 2:27 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…