Trends

ఎవరీ కావ్యా చోప్రా..

ఎవరీ కావ్యా చోప్రా? ఈ రోజు ఉదయం వరకు ఆమె పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. గురువారం ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి ఆమె పేరు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు వస్తోంది. ఇక.. మీడియా గ్రూపుల్లో.. మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆమె ఫోటో అదే పనిగా వస్తోంది.

బ్రేకింగ్ న్యూస్ లోనూ ఆమె మెరుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఏం సాధించిందని ఇంత బజ్ అంటే.. తాజాగా విడుదలైన జేఈఈ పరీక్షా ఫలితాల్లో జాతీయస్థాయిలో తొలి ర్యాంకు సాధించటమే. అది కూడా రికార్డు స్థాయిలో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన తొలి మహిళగా ఆమె నిలిచింది.

ఈ నెల 16-18 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మొయిన్స్ పేపర్ 1 పరీక్షకు 6.19లక్షల మంది అప్లై చేస్తే.. 5.90లక్షల మంది రాశారు. 300 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో 13 మంది 100 శాతం స్కోర్ ను సాధించారు. 2021లో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన ఆమె.. నూటికి నూరు శాతం మార్కులు సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా రికార్డును క్రియేట్ చేసింది. ఇదే.. ఆమె వైరల్ కావటానికి కారణంగా చెప్పాలి.

ఆమె సాధించిన మార్కుల నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ లేదంటే ఐఐటీ ముంబయిలో సీటు సాధించే వీలుంది. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేయాలని భావిస్తున్న ఈ టీనేజ్ సంచలనం తాజా విజయంపై ఫుల్ హ్యాపీగా ఉంది. తమ ఇంట్లో తనను.. తన సోదరుడ్ని సమానంగా చూశారే తప్పించి.. అబ్బాయి ఎక్కువ.. అమ్మాయి తక్కువ అన్నట్లు చూడలేదట. దేశంలోని చాలామంది అమ్మాయిలు ఎదుర్కొన్న వివక్షను తానెప్పుడూ ఎదుర్కోలేదని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన కావ్య.. తాను సాధించిన ఈ ఘనత ఉత్తనే రాలేదని రోజుకు ఏడెనిమిది గంటల కష్టంతో వచ్చినట్లు చెబుతోంది.

This post was last modified on March 25, 2021 6:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago