Trends

ఎవరీ కావ్యా చోప్రా..

ఎవరీ కావ్యా చోప్రా? ఈ రోజు ఉదయం వరకు ఆమె పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. గురువారం ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి ఆమె పేరు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు వస్తోంది. ఇక.. మీడియా గ్రూపుల్లో.. మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆమె ఫోటో అదే పనిగా వస్తోంది.

బ్రేకింగ్ న్యూస్ లోనూ ఆమె మెరుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఏం సాధించిందని ఇంత బజ్ అంటే.. తాజాగా విడుదలైన జేఈఈ పరీక్షా ఫలితాల్లో జాతీయస్థాయిలో తొలి ర్యాంకు సాధించటమే. అది కూడా రికార్డు స్థాయిలో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన తొలి మహిళగా ఆమె నిలిచింది.

ఈ నెల 16-18 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మొయిన్స్ పేపర్ 1 పరీక్షకు 6.19లక్షల మంది అప్లై చేస్తే.. 5.90లక్షల మంది రాశారు. 300 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో 13 మంది 100 శాతం స్కోర్ ను సాధించారు. 2021లో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన ఆమె.. నూటికి నూరు శాతం మార్కులు సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా రికార్డును క్రియేట్ చేసింది. ఇదే.. ఆమె వైరల్ కావటానికి కారణంగా చెప్పాలి.

ఆమె సాధించిన మార్కుల నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ లేదంటే ఐఐటీ ముంబయిలో సీటు సాధించే వీలుంది. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేయాలని భావిస్తున్న ఈ టీనేజ్ సంచలనం తాజా విజయంపై ఫుల్ హ్యాపీగా ఉంది. తమ ఇంట్లో తనను.. తన సోదరుడ్ని సమానంగా చూశారే తప్పించి.. అబ్బాయి ఎక్కువ.. అమ్మాయి తక్కువ అన్నట్లు చూడలేదట. దేశంలోని చాలామంది అమ్మాయిలు ఎదుర్కొన్న వివక్షను తానెప్పుడూ ఎదుర్కోలేదని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన కావ్య.. తాను సాధించిన ఈ ఘనత ఉత్తనే రాలేదని రోజుకు ఏడెనిమిది గంటల కష్టంతో వచ్చినట్లు చెబుతోంది.

This post was last modified on March 25, 2021 6:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

10 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

11 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

12 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago