Trends

ఎవరీ కావ్యా చోప్రా..

ఎవరీ కావ్యా చోప్రా? ఈ రోజు ఉదయం వరకు ఆమె పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. గురువారం ఉదయం పదకొండు గంటల తర్వాత నుంచి ఆమె పేరు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు వస్తోంది. ఇక.. మీడియా గ్రూపుల్లో.. మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆమె ఫోటో అదే పనిగా వస్తోంది.

బ్రేకింగ్ న్యూస్ లోనూ ఆమె మెరుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు? ఏం సాధించిందని ఇంత బజ్ అంటే.. తాజాగా విడుదలైన జేఈఈ పరీక్షా ఫలితాల్లో జాతీయస్థాయిలో తొలి ర్యాంకు సాధించటమే. అది కూడా రికార్డు స్థాయిలో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన తొలి మహిళగా ఆమె నిలిచింది.

ఈ నెల 16-18 వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మొయిన్స్ పేపర్ 1 పరీక్షకు 6.19లక్షల మంది అప్లై చేస్తే.. 5.90లక్షల మంది రాశారు. 300 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో 13 మంది 100 శాతం స్కోర్ ను సాధించారు. 2021లో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన ఆమె.. నూటికి నూరు శాతం మార్కులు సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా రికార్డును క్రియేట్ చేసింది. ఇదే.. ఆమె వైరల్ కావటానికి కారణంగా చెప్పాలి.

ఆమె సాధించిన మార్కుల నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ లేదంటే ఐఐటీ ముంబయిలో సీటు సాధించే వీలుంది. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేయాలని భావిస్తున్న ఈ టీనేజ్ సంచలనం తాజా విజయంపై ఫుల్ హ్యాపీగా ఉంది. తమ ఇంట్లో తనను.. తన సోదరుడ్ని సమానంగా చూశారే తప్పించి.. అబ్బాయి ఎక్కువ.. అమ్మాయి తక్కువ అన్నట్లు చూడలేదట. దేశంలోని చాలామంది అమ్మాయిలు ఎదుర్కొన్న వివక్షను తానెప్పుడూ ఎదుర్కోలేదని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన కావ్య.. తాను సాధించిన ఈ ఘనత ఉత్తనే రాలేదని రోజుకు ఏడెనిమిది గంటల కష్టంతో వచ్చినట్లు చెబుతోంది.

This post was last modified on March 25, 2021 6:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

29 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

2 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

4 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago