కాలం మారింది. నేరాల తీరులోనూ మార్పులు వచ్చేశాయి. అదివరకు దొంగతనం.. ఘర్షణలు.. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదంతా మారింది. సైబర్ మోసాలు.. ఎదుటోడి అవసరాన్ని.. అత్యాశను.. కోరికను కొట్టి డబ్బులు దోచేసే తీరు ఎక్కువైంది. గతంలో నేరాలు చేసే వారి జాబితాలో మగాళ్లు ఎక్కువగా.. ఆడాళ్లు తక్కువగా కనిపించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మహిళలు కూడా దారుణ మోసాలకు.. నేరాలకు తెర తీస్తున్న పరిస్థితి.
తాజాగా అలాంటి కిలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా భావిస్తున్న అంజలి అలియాస్ భాగ్ వతిని రాజస్తాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె పెళ్లి పేరుతో వల వేసి.. పెళ్లి చేసుకొని అదుపుచూసి.. నగలు.. నగదు పట్టుకొని ఉడాయించేది. ఇప్పటివరకు దాదాపు 18 మందిని ఇదే తీరులో పెళ్లాడి మోసం చేసినట్లు గుర్తించారు.
తాజాగా జానాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడ్నిపెళ్లాడిన ఆమె.. రూ.3లక్షలతో పారిపోయింది. దీంతో.. ఆమె మోసాన్ని గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వలపన్నిన పోలీసులు ఆమెను సెల్ ఫోన్ నెంబరు సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అంజలి తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే.. షాకింగ్ నిజాలుబయటకు వచ్చాయి. ఇప్పటివరకు తాము 18 మందిని పెళ్లాడినట్లుగా ఒప్పుకున్నారు. బాధితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
This post was last modified on March 21, 2021 3:13 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…