కాలం మారింది. నేరాల తీరులోనూ మార్పులు వచ్చేశాయి. అదివరకు దొంగతనం.. ఘర్షణలు.. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదంతా మారింది. సైబర్ మోసాలు.. ఎదుటోడి అవసరాన్ని.. అత్యాశను.. కోరికను కొట్టి డబ్బులు దోచేసే తీరు ఎక్కువైంది. గతంలో నేరాలు చేసే వారి జాబితాలో మగాళ్లు ఎక్కువగా.. ఆడాళ్లు తక్కువగా కనిపించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మహిళలు కూడా దారుణ మోసాలకు.. నేరాలకు తెర తీస్తున్న పరిస్థితి.
తాజాగా అలాంటి కిలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా భావిస్తున్న అంజలి అలియాస్ భాగ్ వతిని రాజస్తాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె పెళ్లి పేరుతో వల వేసి.. పెళ్లి చేసుకొని అదుపుచూసి.. నగలు.. నగదు పట్టుకొని ఉడాయించేది. ఇప్పటివరకు దాదాపు 18 మందిని ఇదే తీరులో పెళ్లాడి మోసం చేసినట్లు గుర్తించారు.
తాజాగా జానాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడ్నిపెళ్లాడిన ఆమె.. రూ.3లక్షలతో పారిపోయింది. దీంతో.. ఆమె మోసాన్ని గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వలపన్నిన పోలీసులు ఆమెను సెల్ ఫోన్ నెంబరు సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అంజలి తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే.. షాకింగ్ నిజాలుబయటకు వచ్చాయి. ఇప్పటివరకు తాము 18 మందిని పెళ్లాడినట్లుగా ఒప్పుకున్నారు. బాధితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
This post was last modified on March 21, 2021 3:13 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…