కాలం మారింది. నేరాల తీరులోనూ మార్పులు వచ్చేశాయి. అదివరకు దొంగతనం.. ఘర్షణలు.. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదంతా మారింది. సైబర్ మోసాలు.. ఎదుటోడి అవసరాన్ని.. అత్యాశను.. కోరికను కొట్టి డబ్బులు దోచేసే తీరు ఎక్కువైంది. గతంలో నేరాలు చేసే వారి జాబితాలో మగాళ్లు ఎక్కువగా.. ఆడాళ్లు తక్కువగా కనిపించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మహిళలు కూడా దారుణ మోసాలకు.. నేరాలకు తెర తీస్తున్న పరిస్థితి.
తాజాగా అలాంటి కిలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా భావిస్తున్న అంజలి అలియాస్ భాగ్ వతిని రాజస్తాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె పెళ్లి పేరుతో వల వేసి.. పెళ్లి చేసుకొని అదుపుచూసి.. నగలు.. నగదు పట్టుకొని ఉడాయించేది. ఇప్పటివరకు దాదాపు 18 మందిని ఇదే తీరులో పెళ్లాడి మోసం చేసినట్లు గుర్తించారు.
తాజాగా జానాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడ్నిపెళ్లాడిన ఆమె.. రూ.3లక్షలతో పారిపోయింది. దీంతో.. ఆమె మోసాన్ని గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వలపన్నిన పోలీసులు ఆమెను సెల్ ఫోన్ నెంబరు సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అంజలి తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే.. షాకింగ్ నిజాలుబయటకు వచ్చాయి. ఇప్పటివరకు తాము 18 మందిని పెళ్లాడినట్లుగా ఒప్పుకున్నారు. బాధితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…