కాలం మారింది. నేరాల తీరులోనూ మార్పులు వచ్చేశాయి. అదివరకు దొంగతనం.. ఘర్షణలు.. ఇలాంటి కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అదంతా మారింది. సైబర్ మోసాలు.. ఎదుటోడి అవసరాన్ని.. అత్యాశను.. కోరికను కొట్టి డబ్బులు దోచేసే తీరు ఎక్కువైంది. గతంలో నేరాలు చేసే వారి జాబితాలో మగాళ్లు ఎక్కువగా.. ఆడాళ్లు తక్కువగా కనిపించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మహిళలు కూడా దారుణ మోసాలకు.. నేరాలకు తెర తీస్తున్న పరిస్థితి.
తాజాగా అలాంటి కిలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా భావిస్తున్న అంజలి అలియాస్ భాగ్ వతిని రాజస్తాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె పెళ్లి పేరుతో వల వేసి.. పెళ్లి చేసుకొని అదుపుచూసి.. నగలు.. నగదు పట్టుకొని ఉడాయించేది. ఇప్పటివరకు దాదాపు 18 మందిని ఇదే తీరులో పెళ్లాడి మోసం చేసినట్లు గుర్తించారు.
తాజాగా జానాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడ్నిపెళ్లాడిన ఆమె.. రూ.3లక్షలతో పారిపోయింది. దీంతో.. ఆమె మోసాన్ని గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వలపన్నిన పోలీసులు ఆమెను సెల్ ఫోన్ నెంబరు సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అంజలి తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే.. షాకింగ్ నిజాలుబయటకు వచ్చాయి. ఇప్పటివరకు తాము 18 మందిని పెళ్లాడినట్లుగా ఒప్పుకున్నారు. బాధితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…