Trends

కరోనా టీకా వృథా అవుతోందట

ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటే తెలుగురాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ టీకా వృధా అవుతోంది. గడచిన ఏడాదిగా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిమాసాల తర్వాత వైరస్ కు విరుగుడు టీకాను కొన్ని ఫార్మాకంపెనీలు తయారుచేశాయి. టీకాను వేసుకోవటానికి కూడా కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ మొదలైంది. ఇందులో భాగంగానే తెలుగురాష్ట్రాల్లో 10 శాతం టీకాలు వృధా అవుతున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో మోడి మాట్లాడుతూ దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతున్నట్లు చెప్పారు.

యావత్ ప్రపంచం టీకా కోసం ఎదురుచూస్తున్న సమయంలో మన దగ్గర టీకా వృధా అవటం చాలా ఆందోళనగా ఉందన్నారు. టీకావృధా ఏరూపంలో జరుగుతోందనే విషయాన్ని మాత్రం ప్రధాని చెప్పలేదు. రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణాలో 17.6 శాతం, ఏపిలో 11.6 శాతం టీకా వృధా అవుతోందట. తర్వాత ఉత్తరప్రదేశ్ లో 9.4 శాతం వృధా అవుతోందట.

టీకాను అందుబాటులోకి తెచ్చినపుడే జీరో శాతం వృధా టార్గెట్ గా మొదలుపెట్టారట. కానీ కేంద్రం అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతోందని మోడి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇదే సమయంలో టీకాను వేయటంలో ఏపి 7వ స్ధానంలో ఉందట. రోజుకు సగటును 35997 డోసులు వేస్తున్నారు. రాజస్ధాన్ లో అత్యధిక 1.52 లక్షల డోసులను వేస్తున్నారు. మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎక్కువగా కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరుగుతోంది.

This post was last modified on March 18, 2021 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

3 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

4 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

5 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago