ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటే తెలుగురాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ టీకా వృధా అవుతోంది. గడచిన ఏడాదిగా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిమాసాల తర్వాత వైరస్ కు విరుగుడు టీకాను కొన్ని ఫార్మాకంపెనీలు తయారుచేశాయి. టీకాను వేసుకోవటానికి కూడా కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి నేపధ్యంలోనే మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ మొదలైంది. ఇందులో భాగంగానే తెలుగురాష్ట్రాల్లో 10 శాతం టీకాలు వృధా అవుతున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో మోడి మాట్లాడుతూ దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతున్నట్లు చెప్పారు.
యావత్ ప్రపంచం టీకా కోసం ఎదురుచూస్తున్న సమయంలో మన దగ్గర టీకా వృధా అవటం చాలా ఆందోళనగా ఉందన్నారు. టీకావృధా ఏరూపంలో జరుగుతోందనే విషయాన్ని మాత్రం ప్రధాని చెప్పలేదు. రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణాలో 17.6 శాతం, ఏపిలో 11.6 శాతం టీకా వృధా అవుతోందట. తర్వాత ఉత్తరప్రదేశ్ లో 9.4 శాతం వృధా అవుతోందట.
టీకాను అందుబాటులోకి తెచ్చినపుడే జీరో శాతం వృధా టార్గెట్ గా మొదలుపెట్టారట. కానీ కేంద్రం అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతోందని మోడి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇదే సమయంలో టీకాను వేయటంలో ఏపి 7వ స్ధానంలో ఉందట. రోజుకు సగటును 35997 డోసులు వేస్తున్నారు. రాజస్ధాన్ లో అత్యధిక 1.52 లక్షల డోసులను వేస్తున్నారు. మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎక్కువగా కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరుగుతోంది.
This post was last modified on March 18, 2021 9:50 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…