ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటే తెలుగురాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ టీకా వృధా అవుతోంది. గడచిన ఏడాదిగా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిమాసాల తర్వాత వైరస్ కు విరుగుడు టీకాను కొన్ని ఫార్మాకంపెనీలు తయారుచేశాయి. టీకాను వేసుకోవటానికి కూడా కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి నేపధ్యంలోనే మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ మొదలైంది. ఇందులో భాగంగానే తెలుగురాష్ట్రాల్లో 10 శాతం టీకాలు వృధా అవుతున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో మోడి మాట్లాడుతూ దేశం మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతున్నట్లు చెప్పారు.
యావత్ ప్రపంచం టీకా కోసం ఎదురుచూస్తున్న సమయంలో మన దగ్గర టీకా వృధా అవటం చాలా ఆందోళనగా ఉందన్నారు. టీకావృధా ఏరూపంలో జరుగుతోందనే విషయాన్ని మాత్రం ప్రధాని చెప్పలేదు. రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణాలో 17.6 శాతం, ఏపిలో 11.6 శాతం టీకా వృధా అవుతోందట. తర్వాత ఉత్తరప్రదేశ్ లో 9.4 శాతం వృధా అవుతోందట.
టీకాను అందుబాటులోకి తెచ్చినపుడే జీరో శాతం వృధా టార్గెట్ గా మొదలుపెట్టారట. కానీ కేంద్రం అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మూడు రాష్ట్రాల్లో టీకా వృధా అవుతోందని మోడి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇదే సమయంలో టీకాను వేయటంలో ఏపి 7వ స్ధానంలో ఉందట. రోజుకు సగటును 35997 డోసులు వేస్తున్నారు. రాజస్ధాన్ లో అత్యధిక 1.52 లక్షల డోసులను వేస్తున్నారు. మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎక్కువగా కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరుగుతోంది.
This post was last modified on March 18, 2021 9:50 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…