Trends

చదివేది ఎనిమిది.. స్కూల్ వెళ్లమంటే ఆత్మహత్య !!

స్కూల్ కు వెళ్లమంటే చాలు ఎగిరి గంతేసి ఎప్పుడెప్పుడు వెళదామా? అని ఆశగా చూస్తారు. అయితే.. కొందరికి స్కూల్ అంటే ఇష్టం ఉండదు. వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు మందలించటం.. స్కూల్ కు వెళ్లమని పోరు పెట్టటం చేస్తుంటారు. అదంతా కూడా పిల్లల మీద తమకున్న ప్రేమ..వారు పెద్దాయక కష్టపడకుండా ఉండాలనే. కానీ..ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొందరు పిల్లలు చేసే పనులు షాకింగ్ గా మారతాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది.

హైదరాబాద్ శివారులోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే విజయకుమార్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడికి ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కుమార్తెలు. పెద్ద కొడుకు అర్జున్ స్థానిక స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల స్కూల్ ప్రారంభం కావటంతో అతడ్ని బలవంతంగా పంపారు. తనకు స్కూల్ ఇష్టం లేదని ఎంత చెప్పినా వారు ఒప్పుకోలేదు. స్కూల్ కు వెళ్లాలంటూ ఒత్తిడి చేసి మందలించారు.

దీంతో.. మనస్తాపానికి గురైన అర్జున్.. తండ్రి ఇంట్లో లేని వేళ బాత్రూంలోకి వెళ్లి టవల్ తో ఊరి వేసుకున్నారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో తలుపు తీసి లోపలకు వెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులుధ్రువీకరించారు. బిడ్డ భవిష్యత్తు కోసం చదువుకోమని చెబితే ఇలా ఉసురు తీసుకుంటాడని ఊహించలేదని కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది.

This post was last modified on March 7, 2021 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

9 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

9 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

10 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

10 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

11 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

11 hours ago