గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు నడి రోడ్డు మీద కోట్లాడుకోవటమే కాదు.. చివరకు విషయం కత్తిపోట్ల వరకు వెళ్లి.. ఒకరి మరణానికి కారణమైంది. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇల్లెందు ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే పాతికేళ్ల యువకుడు పనుల కోసం ఖమ్మం పట్టణానికి చేరుకున్నాడు. ఉదయం పనులు.. సాయంత్రం చుక్కేసి ఇంటికి వెళ్లటం అలవాటు. ఈ క్రమంలో ఇటీవల ఒక మహిళ పరిచయమైంది. ఆమె సాన్నిహిత్యం కోసం ప్రయత్నించగా.. ఇవాళ బిజీ మరోసారి కలుద్దామని వెళ్లిపోయింది.
ఆమె మీద ఇష్టం పెంచుకున్న వెంకటేశ్.. ఆమె కోసం అదే సెంటర్లో వెయిట్ చేసేవాడు. తాజాగా ఆమె మరోసారి తారసపడింది. ఈసారి ప్రపోజ్ చేయగా.. ఆమె ఓకే చెప్పింది. ఈ రోజు ఇద్దరం కలిసి ఉందామన్న ప్రపోజల్ కు ఓకే చెప్పటంతో ఫుడ్ పార్సిల్ చేయించసాగాడు. అదే క్రమంలో అక్కడకు వచ్చిన రాపోలు వెంకటేశ్వర్లు.. ఆమెను తనతో రావాలని బలవంతం చేశాడు.
తనతో సహజీవనం చేస్తూ.. మరో వ్యక్తితో ఎలా వెళతావని నిలదీశాడు. దీంతో.. ఆమె కోసం వెంకటేశ్.. వెంకటేశ్వర్లు గొడవ పడ్డారు. అది కాస్తా కోట్లాటకు దారి తీసింది. వెంకటేశ్వర్లు తన దగ్గరున్న కత్తితో వెంకటేశ్ పొత్తికడుపులో పొడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడు. ఒక అమ్మాయి కోసం గొడవ పడి.. ఒకరు మరణించిన వైనం సంచలనంగా మారింది. రద్దీగా ఉండే ఖమ్మం సెంటర్లో రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకోవటం గమనార్హం.
This post was last modified on February 16, 2021 10:45 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…