గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు నడి రోడ్డు మీద కోట్లాడుకోవటమే కాదు.. చివరకు విషయం కత్తిపోట్ల వరకు వెళ్లి.. ఒకరి మరణానికి కారణమైంది. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇల్లెందు ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే పాతికేళ్ల యువకుడు పనుల కోసం ఖమ్మం పట్టణానికి చేరుకున్నాడు. ఉదయం పనులు.. సాయంత్రం చుక్కేసి ఇంటికి వెళ్లటం అలవాటు. ఈ క్రమంలో ఇటీవల ఒక మహిళ పరిచయమైంది. ఆమె సాన్నిహిత్యం కోసం ప్రయత్నించగా.. ఇవాళ బిజీ మరోసారి కలుద్దామని వెళ్లిపోయింది.
ఆమె మీద ఇష్టం పెంచుకున్న వెంకటేశ్.. ఆమె కోసం అదే సెంటర్లో వెయిట్ చేసేవాడు. తాజాగా ఆమె మరోసారి తారసపడింది. ఈసారి ప్రపోజ్ చేయగా.. ఆమె ఓకే చెప్పింది. ఈ రోజు ఇద్దరం కలిసి ఉందామన్న ప్రపోజల్ కు ఓకే చెప్పటంతో ఫుడ్ పార్సిల్ చేయించసాగాడు. అదే క్రమంలో అక్కడకు వచ్చిన రాపోలు వెంకటేశ్వర్లు.. ఆమెను తనతో రావాలని బలవంతం చేశాడు.
తనతో సహజీవనం చేస్తూ.. మరో వ్యక్తితో ఎలా వెళతావని నిలదీశాడు. దీంతో.. ఆమె కోసం వెంకటేశ్.. వెంకటేశ్వర్లు గొడవ పడ్డారు. అది కాస్తా కోట్లాటకు దారి తీసింది. వెంకటేశ్వర్లు తన దగ్గరున్న కత్తితో వెంకటేశ్ పొత్తికడుపులో పొడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడు. ఒక అమ్మాయి కోసం గొడవ పడి.. ఒకరు మరణించిన వైనం సంచలనంగా మారింది. రద్దీగా ఉండే ఖమ్మం సెంటర్లో రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకోవటం గమనార్హం.
This post was last modified on February 16, 2021 10:45 am
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…