మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను కదిలించేస్తోంది. మహారాష్ట్రలోని శంబాజీ నగర్కు చెందిన భార్యాభర్తలు మురళీధర్, సంగీత.. వారి కొడుకు కునాల్ అందరూ చూస్తుండగా ఒక కొండ మీది నుంచి పడి మరణించారు. ముందుగా తండ్రీ కొడుకులు, తర్వాత తల్లి నిమిషాల వ్యవధిలో కొండ మీది నుంచి పడిపోయి మరణించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ముగ్గురి ప్రాణాలు పోవడానికి ఐఫోన్ కారణమంటూ ఒక ప్రచారం జరుగుతోంది. తన తండ్రి ఐఫోన్ కొనివ్వకపోవడం వల్లే కునాల్ కొండ మీదికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని.. మూడు గంటల పాటు తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని.. పదుల సంఖ్యలో జనాలు, పోలీసులు ఉన్నా ఏమీ చేయలేకపోయారని అంటున్నారు.
దగ్గరికొస్తే దూకేస్తా అంటూ బెదిరిస్తున్న కొడుకును పక్కకు లాగేయడానికి తండ్రి సమీపానికి వెళ్లగా.. అతను దూకేయడం, కొడుకును పట్టుకోబోయిన తండ్రి కూడా కిందపడిపోవడం.. భర్త, కొడుకు మరణాన్ని చూసి తట్టుకోలేక వెంటనే భార్య కూడా కిందికి దూకేయడం.. ఇలా నిమిషాల్లో పెను విషాదం చోటు చేసుకుంది.
ఐతే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఈ గొడవకు అసలు కారణం ఐఫోన్ కాదని తెలుస్తోంది. ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు కుర్రాడి తల్లి ఒక వీడియోలో విశ్వాసం లేని వ్యక్తులకు ప్రేమను చూపించడం వృథా అంటూ మాట్లాడగా.. అంతకుముందు కూడా అసంతృప్తితో మాట్లాడిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. అలాగే తల్లితో కునాల్ ఎంతో ఆత్మీయంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
తన తండ్రి తల్లిని నిర్లక్ష్యం చేయడంతో కునాల్ తీవ్ర మనో వేదనకు గురయ్యాడని.. ఆయనకు వేరే మహిళతో సంబంధం ఉండడం, లేదా భార్యాభర్తల మధ్య ఇంకేదైనా సమస్య ఉండడం లాంటిది సమస్యకు ప్రధాన కారణం అయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నంలో తాను తాళి కూడా తీసేస్తానని, భర్తను వదిలేసి నీతోనే ఉండిపోతానని తల్లి బతిమాలుతున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. దీన్ని బట్టి ఐఫోన్ అన్నది టాపిక్కే కాదని.. కుటుంబ గొడవలతో తల్లడిల్లిన కునాల్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, కానీ అనుకోకుండా ముగ్గురి ప్రాణాలూ పోయాయని అర్థమవుతోంది.
This post was last modified on August 24, 2026 2:55 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…