‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’
అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్, మురళీ శర్మల మధ్య జరిగిన ఈ సీన్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.
అయితే, ఈ సినిమాలో తండ్రి వాల్మీకిని కొడుకు బంటు ఛమ్మక్ చంద్రకు పట్టించిన వైనం నవ్వులు పూయిస్తుంది. అయితే, అలవైకుంఠపురములో బంటు క్యారెక్టర్ ను అనంతపురములోని ఆరేళ్ల మహేష్ బాగా వంటబట్టించుకున్నట్లుంది. అందుకే, కార్డన్ సెర్చ్ లో దొరకకుండా తన తండ్రి దాచిపెట్టిన బైక్ ను పోలీసులకు దగ్గరుండి మరీ చూపించాడు ఆ బుడతడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని ఓ ఏరియాలో పోలీసులు రెగ్యులర్ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఇంట్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే, తన బండికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేని కారణంతో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సురేష్ అనే వ్యక్తి తన బైక్ ను పక్క వీధిలో దాచిపెట్టారు. పోలీసులను బురిడీ కొట్టించానని ఫుల్ జోష్ లో ఉన్న సురేష్ కు ఆయన కొడుకు మహేంద్ర షాకిచ్చాడు.
‘‘మా డాడీ…బండి బయటపెట్టిండు…ఇంట్లో పెట్టకుండా.. మీరు వస్తున్నారని దాచిపెట్టాడు..అదిగో మా బండి…’’ అంటూ పక్క వీధిలోకి పోలీసులను తీసుకువెళ్లాడు మహేంద్ర. పక్కా ప్లాన్ తో పక్క వీధిలో పార్క్ చేసిన బైక్ ను తన కొడుకే పట్టించడంతో సురేష్ షాక్ లో ఉండిపోయాడు. తన కొడుకు అడ్డంగా బుక్ చేయడంతో చేసేదేమీ లేక పోలీసుల ముందు తెల్లమొహమేశాడు.
అయితే, ఈ మొత్తం సీన్ లో పోలీసులు ఆ బుడ్డోడి మాటలను సరదాగా తీసుకొని నవ్వుకుంటూ వెళ్లారు. మరి, తండ్రిని పట్టించిన తనయుడి మాటలకు ఫిదా అయిపోయి తండ్రికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారా…లేదా అన్న సంగతి తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బంటు మాదిరి వాళ్ల నాన్నను ఇరకాటంలో పడేసిన మహేంద్రను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
This post was last modified on August 21, 2026 7:20 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…