చైనా.. ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది కరోనా! ప్రపంచాన్ని గడగడలాడించి లక్షల సంఖ్యలో ప్రజలను మృత్యువాతపడేసి.. బంధాలు, బంధుత్వాలను కూడా శాశ్వతంగా చెరపేసిన కంటికి కనిపించ ని శత్రువు పుట్టిన దేశంగా చైనా ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. అమెరికా అంచనా మేరకు కరోనా వ్యాపించని దేశం అంటూ.. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. సో.. చైనా పేరు చెప్పగానే కరోనా కంట్రీ అనే మాట వినిపిస్తోంది. ఇక, ఇది మొన్నటి మాట. గడిచిన నెలరోజులుగా కరోనా వైరస్ కొంతమేరకు బలపడి స్ట్రెయిన్గా ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది.
బ్రిటన్లో స్ట్రెయిన్ ధాటికి మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ స్ట్రెయిన్ మన దేశం లోనూ విస్తరించింది. ఇప్పటికి కరోనా కేసులు అంతో ఇంతో తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న క్రమంలో.. భారత్లోనూ స్ట్రెయిన్ కేసులు ఇప్పటి వరకు 90 దాటినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ విషయంలో కొంత మేరకు పురోగతి కనిపించడం, ఈ నెల 16 నుంచి భారీ ఎత్తున వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కరోనాపై కొంత ఆవేదన, ఆందోళన తగ్గినా.. స్ట్రెయిన్ భయపెడుతోంది. అంటే.. చైనా పోయింది.. ఇప్పుడు దాని ప్లేస్లో బ్రిటన్ చేరింది.
ఇక, ఈ రెండు దేశాల పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు అమెరికా కూడా కరోనా రూపాంతర దశకు చెందిన వైరస్తో అల్లాడిపోతోంది.పైగా ఇది స్ట్రెయిన్ తర్వాత దశగా అగ్రరాజ్యం వైట్ హౌస్ టాస్క్ ఫోర్సు వెల్లడిం చడం గమనార్హం. అంతేకాదు, తాజాగా వెలుగు చూసిన యూఎస్ – వైరస్.. స్ట్రెయిన్ కన్నా 50 శాతం ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని, పరివర్తిస్తుందనిపేర్కొనడం మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఈ వైరస్ ధాటికి రోజుకు 3 వేల పైచిలుకు జనాభా మృత్యువాత పడడం గమనార్హం. దీంతో నాడు చైనా.. తర్వాత బ్రిటన్.. ఇప్పుడు అమెరికా వంతు వచ్చిందా.. ఈ ప్రపంచాన్ని ముంచేయడానికి అనే కామెంట్లు సోషల్ మిడియాలో వెల్లువెత్తుతుండడం గమనార్హం.
This post was last modified on January 10, 2021 10:17 am
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…